Pawan Kalyan: భావోద్వేగాలను రెచ్చగొట్టి.. ఘర్షణలు సృష్టించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన పీఏసీ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ కేంద్రంగా అధికార పార్టీ వైసీపీ విధ్వంసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. అక్కడి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. వివాదాలు సృష్టించి కల్లోలాలు రేపాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందని పవన్ విమర్శలు చేశారు. ఇందులో భాగంగానే ఈనెల 15న జరిగిన జనసేన జనవాణి కార్యక్రమంపై ఆంక్షలు విధించిందన్నారు. ఉత్తరాంధ్రపై తనకున్న ప్రేమ మాటల్లో వ్యక్తం చేయలేనిదని తెలిపారు. సిక్కోలు ఉద్యమం తనకు పోరాట అడుగులు నేర్పితే అక్కడి ఆట పాట తనను చైతన్యవంతుడిని చేశాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
అధికార పార్టీకే భావ స్వేచ్ఛ ఉంటుందని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైసీపీకి కొత్తగా కొమ్ములు పుట్టుకు రాలేదని.. కొత్తగా రాజ్యాంగం లేదని స్పష్టం చేశారు. వైసీపీ వ్యవహరిస్తున్న తీరుకు చెప్పు చూపించక ఏం చూపించాలని నిలదీశారు. పెద్ద స్థాయి అధికారులు కూడా వంగి వంగి సలాం చేస్తుంటే చెప్పు చూపించక ఏం చూపించాలన్నారు. తాము అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
Also Read
- CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
- OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
- Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
Read Also: Perni Nani: పవన్ కళ్యాణ్పై దాడికి కుట్ర చేశామా? అరాచకాలు సృష్టించిన వారికి సన్మానాలా?
అటు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంకు చెందిన జనసేన నేత బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 అంబులెన్స్ సర్వీసులను పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ప్రారంభించారు. దాదాపు రూ.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ 3 అంబులెన్సులు రాజానగరం నియోజకవర్గంలో ఉచితంగా సేవలు అందిస్తాయని జనసేన వర్గాలు తెలిపాయి. వీటిలో అత్యాధునిక వెంటిలేటర్లు, అధునాతన లైఫ్ సపోర్ట్ యంత్రాలతో పాటు 40 రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
తాజావార్తలు
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!