Pudi Srihari Arrest: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పొలిటికల్) పూడి శ్రీహరి అరెస్ట్పై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అరెస్ట్ను అక్రమంగా పేర్కొంటూ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ ఇంచార్జ్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం…
RK Roja: తిరుపతి డీబీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చా గోష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధిని విస్మరించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకానికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేని ప్రభుత్వం, అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తుందని…
తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ, అక్రమాలపై పోరాడే వారికి అండగా ఉండటమే తన ఉద్యోగం అని మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టిన వారిని నిలదీయడమే తన పని అని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటా అని.. అన్యాయానికి గురైనోడే ప్రశ్నిస్తాడన్నారు. రాజకీయాల్లో చెడిపోయిన వారి లాగే పోలీసుల్లోనూ కొందరు చెడిపోయారని విమర్శించారు. యూనిఫాం వేసుకుని కూడా కొందరు బార్లలో మందు…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐదు కీలక టవర్ల నిర్మాణ వ్యయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ పేరుతో రూ. 1,100 కోట్లు ఖర్చు చేసి, ఇప్పుడు వాటిని పక్కన పెట్టి మళ్ళీ కొత్త నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాత్కాలిక భవనాల కోసం ఖర్చు చేసిన ఆ నిధులన్నీ ఇప్పుడు గంగలో పోసినట్టేనని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి లేవని, ఆయన దృష్టిలో పరిపాలన అంటే కేవలం అవినీతి, దోపిడీ మాత్రమేనని జగన్ దుయ్యబట్టారు. గత వారం శాసనసభలో అమరావతిపై ప్రవేశపెట్టిన తీర్మానం కేవలం ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నమని జగన్ విమర్శించారు. అసలు రాజ్యాంగంలో రాష్ట్రానికి ‘రాజధాని’…
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిని రాష్ట్ర అధికారిక రాజధానిగా స్థిరపరుస్తూ, దానికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో ‘ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026’ను రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని, కేంద్రం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సెన్సార్ కంప్లిట్.. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం…
తెలుగునాట రాజకీయ యవనికపై ఒక ప్రభంజనంలా ఉద్భవించిన తెలుగుదేశం పార్టీ నేడు 44వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఈ ప్రస్థానంలో పార్టీ ఎన్నో చారిత్రాత్మక విజయాలను నమోదు చేయడమే కాకుండా, ఎన్నెన్నో సంక్షోభాలను, కుట్రలను ధీటుగా ఎదుర్కొని నిలబడిందని ఆయన గుర్తుచేశారు. టీడీపీ కేవలం ఒక రాజకీయ పార్టీ…
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతిపై జరిగిన చర్చ , తీర్మానం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్న ఒక ‘పెద్ద డ్రామా’ అని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టి, ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కేవలం వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశాలు పిల్లి మొగ్గలతో కూడిన సర్కస్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. Nitish Kumar: రాజ్యసభలో ప్రమాణస్వీకారంపై…
Pawan Kalyan – Balineni Meet: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సమావేశమయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్తో భేటీ అవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ గంటన్నర చర్చల వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. Read Also: Story Board: డబ్బిస్తే..…
CM Chandrababu Warns MLAs: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజా రాజకీయ పరిణామాలపై అందుబాటులో ఉన్న మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. నిన్న రాత్రి సమీక్షా సమావేశాలు ముగిసిన అనంతరం సీఎం ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల సుమారు 40 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడినట్లు మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపినట్టు…