Perni Nani: పవన్ కళ్యాణ్పై దాడికి కుట్ర చేశామా? అరాచకాలు సృష్టించిన వారికి సన్మానాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఏ చిన్న ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగినప్పుడు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడటం సహజంగా జరుగుతుందని.. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా ఈరోజు జనసేన పీఏసీ సమావేశం జరిగిందని పేర్ని నాని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగనన్న కాలనీలు నిర్మాణం అవుతుంటే అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో మూడు గజాల స్థలం కూడా ఎవరికీ ఇవ్వలేదని ఆరోపించారు.
మైకుల ముందే పవన్ కళ్యాణ్ పోరాటం కనిపిస్తోందని.. వాస్తవానికి పవన్ దిగజారిపోయి చంద్రబాబుతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్పై దాడికి తాము కుట్ర చేయడమేంటని.. ఆయన విజయవాడ ఎన్నిసార్లు వచ్చారో తెలియదా అని ప్రశ్నించారు. ఆయన వాళ్ల పార్టీ ఆఫీస్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు ఎన్నిసార్లు తిరిగాడో జనసేన నేతలే చెప్పాలన్నారు. ఎప్పుడైనా పవన్కు ఏమైనా జరిగిందా అని నిలదీశారు. అసలు ఇప్పుడు పీఆర్పీ ఎక్కడ ఉందని.. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత పీఆర్పీ నేతలంతా కాంగ్రెస్ నేతలే అవుతారని స్పష్టం చేశారు.
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
Read Also: భార్యలు ఉన్నా మరో హీరోయిన్ తో ఎఫైర్ నడిపిన హీరోలు వీరే..
వరంగల్లో చంద్రబాబు బీసీ గర్జన పెట్టి సోనియా గాంధీని ఆహ్వానించలేదా అని పేర్ని నాని సూటి ప్రశ్న వేశారు. అత్యధికంగా 27 మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు. గత వారం బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు సమావేశం అయ్యారని.. ఈ ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి, సంక్షేమం చేపట్టింది అనేది చర్చించుకుంటున్నారని తెలిపారు. కానీ ఈరోజు జనసేన నేతలు సమావేశమై ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా అరాచకాలు సృష్టించిన వారిని అభినందిస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టడం సిగ్గుచేటు అన్నారు. అనుమతి తీసుకోకుండా విశాఖలో పవన్ ర్యాలీ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రసంగాలు చేశారని మండిపడ్డారు. ముద్రగడపై దాడి సమయంలో పవన్ ఎందుకు ప్రశ్నించలేదని.. కోనసీమలో మంత్రి ఇంటిపై దాడి చేసిన వారిలో జనసేన కార్యకర్తలు లేరా అని పేర్ని నాని నిలదీశారు.
తాజావార్తలు
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!