Perni Nani: పవన్ కళ్యాణ్పై దాడికి కుట్ర చేశామా? అరాచకాలు సృష్టించిన వారికి సన్మానాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఏ చిన్న ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగినప్పుడు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడటం సహజంగా జరుగుతుందని.. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా ఈరోజు జనసేన పీఏసీ సమావేశం జరిగిందని పేర్ని నాని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగనన్న కాలనీలు నిర్మాణం అవుతుంటే అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో మూడు గజాల స్థలం కూడా ఎవరికీ ఇవ్వలేదని ఆరోపించారు.
మైకుల ముందే పవన్ కళ్యాణ్ పోరాటం కనిపిస్తోందని.. వాస్తవానికి పవన్ దిగజారిపోయి చంద్రబాబుతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్పై దాడికి తాము కుట్ర చేయడమేంటని.. ఆయన విజయవాడ ఎన్నిసార్లు వచ్చారో తెలియదా అని ప్రశ్నించారు. ఆయన వాళ్ల పార్టీ ఆఫీస్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు ఎన్నిసార్లు తిరిగాడో జనసేన నేతలే చెప్పాలన్నారు. ఎప్పుడైనా పవన్కు ఏమైనా జరిగిందా అని నిలదీశారు. అసలు ఇప్పుడు పీఆర్పీ ఎక్కడ ఉందని.. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత పీఆర్పీ నేతలంతా కాంగ్రెస్ నేతలే అవుతారని స్పష్టం చేశారు.
Also Read
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
Read Also: భార్యలు ఉన్నా మరో హీరోయిన్ తో ఎఫైర్ నడిపిన హీరోలు వీరే..
వరంగల్లో చంద్రబాబు బీసీ గర్జన పెట్టి సోనియా గాంధీని ఆహ్వానించలేదా అని పేర్ని నాని సూటి ప్రశ్న వేశారు. అత్యధికంగా 27 మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు. గత వారం బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు సమావేశం అయ్యారని.. ఈ ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి, సంక్షేమం చేపట్టింది అనేది చర్చించుకుంటున్నారని తెలిపారు. కానీ ఈరోజు జనసేన నేతలు సమావేశమై ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా అరాచకాలు సృష్టించిన వారిని అభినందిస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టడం సిగ్గుచేటు అన్నారు. అనుమతి తీసుకోకుండా విశాఖలో పవన్ ర్యాలీ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రసంగాలు చేశారని మండిపడ్డారు. ముద్రగడపై దాడి సమయంలో పవన్ ఎందుకు ప్రశ్నించలేదని.. కోనసీమలో మంత్రి ఇంటిపై దాడి చేసిన వారిలో జనసేన కార్యకర్తలు లేరా అని పేర్ని నాని నిలదీశారు.
తాజావార్తలు
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
-
Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..