Perni Nani: పవన్ కళ్యాణ్పై దాడికి కుట్ర చేశామా? అరాచకాలు సృష్టించిన వారికి సన్మానాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఏ చిన్న ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగినప్పుడు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడటం సహజంగా జరుగుతుందని.. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా ఈరోజు జనసేన పీఏసీ సమావేశం జరిగిందని పేర్ని నాని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగనన్న కాలనీలు నిర్మాణం అవుతుంటే అభినందించాల్సింది పోయి ఆరోపణలు చేస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో మూడు గజాల స్థలం కూడా ఎవరికీ ఇవ్వలేదని ఆరోపించారు.
మైకుల ముందే పవన్ కళ్యాణ్ పోరాటం కనిపిస్తోందని.. వాస్తవానికి పవన్ దిగజారిపోయి చంద్రబాబుతో కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్పై దాడికి తాము కుట్ర చేయడమేంటని.. ఆయన విజయవాడ ఎన్నిసార్లు వచ్చారో తెలియదా అని ప్రశ్నించారు. ఆయన వాళ్ల పార్టీ ఆఫీస్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు ఎన్నిసార్లు తిరిగాడో జనసేన నేతలే చెప్పాలన్నారు. ఎప్పుడైనా పవన్కు ఏమైనా జరిగిందా అని నిలదీశారు. అసలు ఇప్పుడు పీఆర్పీ ఎక్కడ ఉందని.. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత పీఆర్పీ నేతలంతా కాంగ్రెస్ నేతలే అవుతారని స్పష్టం చేశారు.
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
Read Also: భార్యలు ఉన్నా మరో హీరోయిన్ తో ఎఫైర్ నడిపిన హీరోలు వీరే..
వరంగల్లో చంద్రబాబు బీసీ గర్జన పెట్టి సోనియా గాంధీని ఆహ్వానించలేదా అని పేర్ని నాని సూటి ప్రశ్న వేశారు. అత్యధికంగా 27 మంది కాపు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ వైసీపీ అని స్పష్టం చేశారు. గత వారం బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు సమావేశం అయ్యారని.. ఈ ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి, సంక్షేమం చేపట్టింది అనేది చర్చించుకుంటున్నారని తెలిపారు. కానీ ఈరోజు జనసేన నేతలు సమావేశమై ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా అరాచకాలు సృష్టించిన వారిని అభినందిస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టడం సిగ్గుచేటు అన్నారు. అనుమతి తీసుకోకుండా విశాఖలో పవన్ ర్యాలీ చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రసంగాలు చేశారని మండిపడ్డారు. ముద్రగడపై దాడి సమయంలో పవన్ ఎందుకు ప్రశ్నించలేదని.. కోనసీమలో మంత్రి ఇంటిపై దాడి చేసిన వారిలో జనసేన కార్యకర్తలు లేరా అని పేర్ని నాని నిలదీశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
-
Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!