Kolikapudi Srinivasa Rao: టీడీపీ క్రమశిక్షణా కమిటీ ముందుకు కొలికపూడి శ్రీనివాస్..
- రేపు టీడీపీ క్రమశిక్షణా కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్
- రేపు ఉదయం 11 గంటలకు టీడీపీ కార్యాలయంలో క్రమశిక్షణా కమిటీ భేటీ
- తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలిపై టీడీపీ అధిష్టానం సీరియస్
- ఇప్పటికే ఒకసారి క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి
- కొలికపూడి వైఖరిపై తీవ్ర అసంతృప్తిలో సీఎం చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. పార్టీ టికెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి.. తన చర్యలతో పార్టీనే ఇరకాటంలోకి నెడుతున్నారు. గతంలో సీఎం చంద్రబాబు కొలికపూడికి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో రేపు మరోసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుకావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. ఇప్పటికే కొలికపూడి ఒకసారి క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. రేపు ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తప్పవన్న చర్చ పార్టీలో జరుగుతుంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై.. టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొలికపూడి తీరుపై సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యేగా కొలికపూడి ప్రజా సమస్యల పరిష్కారం కంటే ఇతర అంశాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా వివాదాస్పదంగా మారారన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎ.కొండూరు మండలం కంభంపాడులో అక్రమ నిర్మాణం అంటూ ఓ ఇంటిని ఎమ్మెల్యే జేసీబీతో కూల్చివేయించారు. ఆ సమయంలో కారుపై కూర్చుని ఆందోళనలకు దిగడం వివాదానికి దారి తీసింది.
Read Also: Bhatti Vikramarka : ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా జరుగుతోంది
Also Read
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
- Minister Nara Lokesh: మైలవరం స్కూల్లో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్ వార్నింగ్..
ఆ తర్వాత చిట్యాలలో సర్పంచ్ ను ఎమ్మెల్యే తిట్టారని వీఆర్ఏగా ఉన్న సర్పంచ్ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. దీంతో అప్పట్లోనే కొలికపూడిపై అధిష్టానం సీరియస్ అయింది. ఇదే సమయంలో కొలికపూడి కూడా తిరువూరులో ర్యాలీ పెడుతున్నట్లు ప్రకటన చేయడం మరింత చర్చకు దారి తీసింది. అయితే అధిష్టానం జోక్యం చేసుకుని ర్యాలీని విరమింపజేసింది. తాజాగా ఈనెల 11న గోపాలపురంలో టీడీపీ గ్రామ కార్యదర్శి భూక్యా రాంబాబు ఇంటికి వెళ్లారు కొలికపూడి. గ్రామంలో రాంబాబుకు ఆయన సోదరుడు వైసీపీ నేత భూక్యా కృష్ణకు మధ్య చాన్నాళ్లుగ ఆస్తి తగాదాలు ఉన్నాయి. గ్రామంలో ఇటీవల వేసిన సీసీ రోడ్డు తన స్థలంలో వేశారని.. వివాదం తేలేవరకు రోడ్డును ఎవరూ వినియోగించకూడదని, దానిపై కంచె వేశారు కృష్ణ. రాంబాబు ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి.. కృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఇక ఎమ్మెల్యే వర్గం తనపై, తన భర్తపై దాడికి పాల్పడ్డారంటూ కృష్ణ భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో ఈ ఘటనతో మరోసారి కొలికపూడి తీరుపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ ఘటనపై పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. రేపు క్రమశిక్షణా కమిటీ ముందుకు రానున్నారు. అయితే రేపు అధిష్టాం ఏం చర్యలు తీసుకోబోతుంది.. క్రమశిక్షణా కమిటీ ముందు ఎమ్మెల్యే కొలికపూడి ఎలాంటి వివరణ ఇస్తారు.. ఆ వివరణకు అధిష్టానం సంతృప్తి చెందుతుందా అనేది చూడాలి.
Read Also: Road Accidents: తెలంగాణలో రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. పలువురికి తీవ్ర గాయాలు
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..