Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- విజయవాడ కలెక్టరేట్లో సంచలనం
- NTR జిల్లా ప్రజా పరిష్కార వేదికలో ఘటన
- అనాసాగరం గ్రామానికి చెందిన మల్లంపూడి లక్ష్మీ తులసి అధికారిపై కారం చల్లిన ఘటన
- భూ వివాదం పరిష్కారం కాలేదన్న ఆగ్రహంతో ఈ చర్య
- నందిగామ మండలంలో భూమి పరిహారం విషయంలో అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లోని ప్రజా పరిష్కార వేదికలో అధికారులపై ఓ వృద్ధురాలు కారం చల్లిన ఘటన కలకలం రేపింది. నందిగమ్మ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మల్లంపూడి లక్ష్మీ తులసి భూ సమస్య పరిష్కారం కాలేదన్న కోపంతో కలెక్టరేట్లో గ్రీవెన్స్ సమయంలో అధికారిపై కారు చెల్లింది. దీంతో ఆమె సమస్య చర్చకు వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు వెంటనే అనాసాగరం గ్రామానికి వెళ్లి భూమిని పరిశీలించారు. నందిగామ ఎంఆర్ఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో సర్వే అధికారులు స్థలాన్ని కొలిచి వివరాలు సేకరించారు. సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం తీసుకొని పరిష్కారం చూపిస్తామని ఎంఆర్ఓ హామి ఇచ్చారు.
CM Chandrababu: అమరావతిలో భారత్ తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీకి శ్రీకారం చుట్టిన సీఎం..!
Also Read
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- Team India: కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టులు.. కానీ ఇక్కడ గెలవకపోతే పరువు పాయే.. తేల్చుకోనున్న టీమిండియా..
- Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
జాతీయ రహదారి పక్కన తనకు 8 1/2 సెంట్ల స్థలం ఉండేదని 2003లో రహదారి విస్తరణలో 50మీటర్ల భూమి వెళ్ళిపోయిందని వృద్ధురాలు తెలిపింది. ఆ తర్వాత 2017లో నందిగామ బైపాస్ రోడ్ విస్తరణ సమయంలో మరింత స్థలం పోయిందని చెప్పింది. ప్రస్తుతం తన దగ్గర 4 సెంట్లు మాత్రమే మిగిలిందని చెప్తోంది. ఈ భూమికి సంబంధించి 2023లో ఆమెకు 6.5 లక్షలు మాత్రమే జమయ్యాయని పక్కనున్న వారికి అదే తరహా భూమికి 24 లక్షలు ఇచ్చారని వృద్ధురాలు ఆరోపిస్తుంది. తనకు రావలసిన పూర్తి పరిహారం ఇవ్వాలని లేదా మిగిలిన స్థలం స్పష్టంగా చూపించాలని ఆమె డిమాండ్ చేసింది.
గతంలో అనేకసార్లు స్థానిక అధికారులను సంప్రదించిన సమస్య పరిష్కారం కాలేదని అంటుంది. కలెక్టరేట్ చుట్టూ తిరిగిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. విసుకు చెంది నిన్న అగ్రీవెన్స్ లో అధికారిపై కారం చెల్లినట్లు ఆమె తెలిపింది.
తాజావార్తలు
-
Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
-
Soft Pulka Tips: పుల్కాలు గట్టిగా వస్తున్నాయా? ఈ 2 సీక్రెట్ టిప్స్ పాటిస్తే బంతిలా పొంగుతాయి!
-
YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
-
Team India: కోట్ల ఐపీఎల్ కాంట్రాక్టులు.. కానీ ఇక్కడ గెలవకపోతే పరువు పాయే.. తేల్చుకోనున్న టీమిండియా..
-
Trump: హార్ముజ్ శాశ్వతంగా టోల్ ఫ్రీగా ఉంటుంది.. జీ 7 సదస్సులో ట్రంప్ ప్రకటన
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?