IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్తో జరగబోయే రాబోయే రెండు టెస్టుల సిరీస్ సందర్భంగా మైదానానికి వచ్చే క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ బోర్డు తీపి కబురు అందించింది. ఆగస్టు 15 నుంచి గాల్ వేదికగా ప్రారంభమయ్యే మొదటి టెస్టుతో పాటు, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్కు కూడా ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విశ్వసనీయమైన ప్రపంచ స్థాయి టెస్టు క్రికెట్ను మైదానంలో నేరుగా వీక్షించేందుకు అభిమానులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా శ్రీలంకలో జరిగే టెస్టు మ్యాచ్లను చూసేందుకు ప్రేక్షకులు తక్కువ సంఖ్యలో వస్తుంటారు. గతంలోనూ భారత జట్టు ఇక్కడ ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు ఆడింది. గత డిసెంబర్లో దక్షిణాఫ్రికా చేతిలో 0–2 తేడాతో సిరీస్ కోల్పోయిన తర్వాత భారత్కు ఇది మొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పోరు.
ఈ కీలక సిరీస్కు ముందు భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభమైంది. మొదటి రోజు ఆటలో శ్రీలంక యంగ్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేస్తూ టీమిండియా బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ నిషాన్ ఫెర్నాండో 65 బంతుల్లో 66 పరుగులు చేసి మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి సీనియర్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దీనితో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. ఐదు వారాల విరామం తర్వాత బరిలోకి దిగడంతో భారత ఫాస్ట్ బౌలర్లు లయ అందుకోవడానికి కొంత సమయం పట్టింది. ప్రారంభంలో స్పిన్నర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, చివరి సెషన్లో కుల్దీప్ యాదవ్ ఆధ్వర్యంలో కోలుకున్నారు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
మొదటి రోజు ఆటలో కుల్దీప్ యాదవ్ 18 ఓవర్లలో 76 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా 15 ఓవర్లలో 64 పరుగులకు 2 వికెట్లు సాధించాడు. మానవ్ సుతార్కు ఒక వికెట్ దక్కింది. ఆఫ్స్పిన్నర్ సారాంశ్ జైన్ 11 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చినా వికెట్ పడగొట్టలేకపోయాడు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్కి ఫస్ట్ క్లాస్ హోదా లేదు, కాబట్టి నిబంధనల ప్రకారం మొదటి రెండు రోజులు రోజుకు 90 ఓవర్లు, మూడో రోజు చెరో 45 ఓవర్ల చొప్పున కేటాయించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!