Off The Record: తెలుగుదేశం పార్టీ కంచుకోట తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం. కానీ గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన కోటాలో వెళ్ళింది. రెండు పార్టీల లీడర్స్, కేడర్ అంతా కలిసి పనిచేశారు, భారీ మెజార్టీతో ఆరణి శ్రీనివాస్ ఎమ్మెల్యే అ్యయారు అది డిఫరెంట్ స్టోరీ. కానీ… ఇప్పుడు అసలు సమస్య అంతా… టీడీపీ కార్యకర్తలదేనట. బలం ఉన్న చోటే పార్టీకి దిక్కుమొక్కు లేకుండా పోయిందని బహిరంగంగానే అంటున్నారు తమ్ముళ్ళు. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే…
CM and Deputy CM Key Meeting: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేపు (మంగళవారం) జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ల భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వరుస అవాంఛనీయ ఘటనలు, పాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు మరియు ప్రజారోగ్యానికి సంబంధించి తలెత్తిన కొన్ని అంశాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.. దీంతో, ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. * వేట్లపాలెం…
Dharmana Prasada Rao: శ్రీకాకుళం జిల్లాలో డయేరియా బాధిత ప్రాంతాల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 నెలలుగా టీడీపీ పాలనలో ప్రజారోగ్యం నిర్లక్ష్యం చేశారు.. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు శాపంలా మారాయి.. ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వాలనుకున్నాం..
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. మూడున్నర గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో.. 50కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. ఎస్ఐపీబీ, సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు.. అయితే, ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశానికి…
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ పెట్టిన వాయిదా తీర్మానంపై చర్చించాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. దీంతో వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేయాల్సిందేనని వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
Off The Record : ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట…రాజకీయ నేతలకు అదొక సంపన్న నియోజకవర్గం. ఆర్థిక వనరులు ఎక్కువగా ఉండటంతో…ఈ రిజర్వుడు నియోజకవర్గంలో పెత్తనం చేసేందుకు అధికార పార్టీలోని కీలక నేతలు పావులు కదుపుతున్నారట. గత ఎన్నికల్లో వైద్యురాలు నెలవల విజయశ్రి 25వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఆమె ఎన్నికైనా…పెత్తనమంతా వేరొకరి చేతుల్లోకి వెళ్లిపోయినట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. విజయశ్రీకి ఆర్థికంగా అండగా నిలబడటంలో, టికెట్ ఇప్పించడంలో ఓ పారిశ్రామికవేత్త కీలకపాత్ర పోషించారు. గెలిచిన తర్వాత…
Off The Record: విజయబగరం జిల్లా శృంగవరపుకోటలో తెలుగుదేశం పార్టీ మూడు వర్గాలు చీలిపోయినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఓ వైపు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వర్గం…మరోవైపు గొంప కృష్ణ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. తాజాగా ఇటీవల పార్టీలో చేరిన ఇందుకూరి సుబ్బలక్ష్మి నేతృత్వంలో మూడో వర్గం తయారైందట. ఒకప్పుడు రెండు వర్గాలకే పరిమితమైన రాజకీయ సమీకరణాలు…ఇప్పుడు మూడు పవర్ సెంటర్స్గా మారినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలైనా, ప్రభుత్వ కార్యక్రమాలైనా…ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు నిర్వహిస్తున్నారు.…
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనను చంపడానికి కూడా ప్రయత్నించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నన్ను బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశారు. ఎన్ని రోజులైనా జైల్లోనే ఉండాలని వెళ్లాను. జైలులో పెడితే భయపడే వ్యక్తిని కాదు అని అంబటి స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఒకవేళ తప్పు చేసినా వెంటనే క్షమాపణలు చెప్పానని తెలిపారు. అయినప్పటికీ…
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు అంబటి. గత 19 రోజులుగా రిమాండ్లో ఉన్న ఆయన విడుదల కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ నిర్వహించి కోట్ల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో అంబటి రాంబాబు అరెస్టయ్యారు. ఈ కేసుతో పాటు ముఖ్యమంత్రి…