Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Instagram Harassment Case: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కోణతమాత్కూరు గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికకు కడప జిల్లా నందలూరు ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ (22)తో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. పరిచయం అనంతరం ఆమెను ప్రేమించమని ఒత్తిడి చేస్తూ, ఫొటోలు మార్ఫింగ్ చేస్తానని బెదిరిస్తూ వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు రాజ్ కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Gold and Silver Price Today: పసిడి ప్రేమికులకు గుడ్న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధర..
Also Read
- Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
- Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
ఇక, ఈ నెల 15వ తేదీన మైనర్ బాలికను మాయమాటలు చెప్పి నందిగామ నుండి బైక్పై తీసుకెళ్లాడు రాజ్ కుమార్, బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాలిక తనతోపాటు తీసుకెళ్లిన ట్యాబ్ ద్వారా లొకేషన్ ఆధారంగా పోలీసులు రాజంపేట సమీపంలోని చిట్వేల్ వద్ద ఉన్నట్లు గుర్తించారు. దీంతో బాలిక బంధువులు వెళ్లి రాజ్ కుమార్ను, బాలికను తీసుకుని నందిగామ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అనంతరం పోలీసులు రాజ్ కుమార్ తల్లిదండ్రులను పిలిపించి అతన్ని పంపించినట్లు సమాచారం. కానీ, ఇటీవల మళ్లీ రెండు రోజులుగా రాజ్ కుమార్ బాలికకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతూ, ఫొటోలు మార్ఫింగ్ చేస్తానని హెచ్చరిస్తున్నట్లు బాలిక తండ్రి షేక్ సిలార్ సాహెబ్ మరోసారి ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం