Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Boycott: ఎన్టీఆర్ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటతో పాటు వారి కుటుంబాన్ని సామాజికంగా వెలివేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. గ్రామానికి చెందిన తేజ, నాగలక్ష్మి ప్రేమించి వివాహం చేసుకోవడంతో గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాహాన్ని అంగీకరించని కుల పెద్దలు, ఆ జంట కుటుంబాన్ని గ్రామం నుంచి దూరం పెట్టేలా నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారితో ఎవరూ మాట్లాడకూడదని, వారి ఇళ్లకు వెళ్లకూడదని, వారు వచ్చినా రానివ్వకూడదని గ్రామంలో చాటింపులు చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా గ్రామ పెద్దల తీర్పును ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో గ్రామ ప్రజలు కూడా ఆ కుటుంబానికి సహాయ నిరాకరణ చేస్తూ దూరంగా ఉంటున్నారని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రేమ జంట తేజ, నాగలక్ష్మి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే అమ్మాయి కుటుంబానికి మాత్రం గ్రామంలో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తోంది. ఇటీవల ఆ జంటకు బాబు పుట్టడంతో బారసాల వేడుక నిర్వహించగా, ఆ కార్యక్రమానికి ఎవరూ వెళ్లకూడదని గ్రామ పెద్దలు మరోసారి ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
- Minister Nara Lokesh: మైలవరం స్కూల్లో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్ వార్నింగ్..
బారసాల వేడుకకు రావాలని గ్రామస్తులను స్వయంగా ఆహ్వానించేందుకు గ్రామంలోకి వచ్చిన కుటుంబ సభ్యులపై కూడా గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని, గ్రామ తీర్పును ఉల్లంఘించారని చెబుతూ రూ.2 లక్షలు జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై బాధిత కుటుంబం మైలవరం పోలీసులను ఆశ్రయించినప్పటికీ స్పందన లేదని ఆరోపిస్తోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, సామాజిక వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఒక కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించడం అనాగరిక చర్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై?
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?