Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Holds Special Meeting With Ntr District Public Representatives

CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..

Published Date :April 25, 2026 , 7:59 am
By Sudhakar Ravula
CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ..  సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి పార్టీలు పరస్పర సమన్వయంతో పని చేయాలని, ప్రతి ఒక్కరూ తమ పనితీరుపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు అందుబాటులో ఉండటం, వ్యవహారశైలి వంటి అంశాలపై ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశానికి ఎంపీ కేశినేని చిన్ని, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ కూడా పాల్గొన్నారు.

గత ఎన్నికల్లో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని టిక్కెట్లు కేటాయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా అవకాశాలు ఇచ్చామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల పనితీరు బాగుంటే ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు వస్తుందని చంద్రబాబు అన్నారు. ప్రజలలో ప్రత్యర్థులపై ఉన్న వ్యతిరేకతను మాత్రమే ఆధారంగా చేసుకోకుండా, సానుకూల ఓటు పెరిగేలా పనిచేయాలని సూచించారు.

Also Read

  • Vijayawada: కలెక్టరేట్‌లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
  • Instagram Harassment Case: మైనర్‌ బాలికకు ఇన్‌స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
  • Minister Nara Lokesh: మైలవరం స్కూల్‌లో మంత్రి లోకేష్‌ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్‌ వార్నింగ్..
  • 10th Student Dies: ఇంటికెళ్లి వస్తామని డాక్టర్కి చెప్పి.. గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థి మృతి
Add as a preferred
source on google

విజయవాడ ఇళ్ల పట్టాల సమస్యకు 3 నెలల్లో పరిష్కారం
విజయవాడ నగరంలోని ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, మూడు నెలలలో సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక సమస్యలు ఉంటే అవసరమైన మేరకు నిబంధనలను సరళీకరించి మానవీయ కోణంలో వ్యవహరించాలని కలెక్టర్‌కు సూచించారు. అదేవిధంగా విజయవాడ నగర సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకోవాలని, కలెక్టర్ పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ముగ్గురు ఎమ్మెల్యేలతో కమిషనర్ సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

జిల్లాలో అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
విజయవాడలో పీపీపీ విధానంలో పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మినీ ఎస్టీపీల ఏర్పాటు, ఆటోనగర్ స్లమ్ పునరావాసం, రామకృష్ణా నగర్ వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఓపెన్ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు వంటి ప్రతిపాదనలకు అంగీకారం తెలిపారు. భవానీపురంలో ఒలింపిక్ ఎక్సలెన్స్ సెంటర్ ఫర్ రోయింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేవీనగర్ నుంచి వాంబే కాలనీ వరకు సింగ్‌నగర్ వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాంబే కాలనీలో హోల్‌సేల్ ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నియోజకవర్గాల వారీగా పలు పనులకు ఆమోదం
* నందిగామ నియోజకవర్గంలోని గొట్టిముక్కల సమీపంలో రూ.8 కోట్లతో వంతెనల నిర్మాణం, చెవిటికల్లులో లక్ష్మయ్య వాగుపై హై లెవల్ బ్రిడ్జి, నందిగామలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
* తిరువూరు నియోజకవర్గంలో కట్టలేరు వద్ద హై లెవల్ వంతెన, ఏ.కొండూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్, ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, తిరువూరులో లెదర్ క్లస్టర్ ఏర్పాటు వంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
* జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పోలంపల్లి ప్రాజెక్టు మరమ్మత్తులు, ఇనాం భూముల సమస్య పరిష్కారం, 30 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సీఎం అంగీకరించారు.
* మైలవరం నియోజకవర్గంలోని హెచ్. ముత్యాంలపాడు వద్ద రూ.10 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. జక్కంపూడి ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
* ఇబ్రహీంపట్నంలో జాస్మిన్ ఫ్లవర్ మార్కెట్‌ను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఏర్పాటు చేయాలని సూచించిన సీఎం, అక్కడ అన్న క్యాంటీన్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh CM review
  • Andhra Pradesh development projects
  • ap politics
  • Chandrababu latest news
  • CM Chandrababu Naidu

తాజావార్తలు

  • MK Stalin-Rajinikanth: స్టాలిన్‌ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు

  • Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!

  • VIJAY: ప్రమాణస్వీకారానికి ముందు విజయ్‌కు బిగ్ షాక్.. PMLA కేసు దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం..

  • Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్

  • India-Pakistan: “పాకిస్తాన్‌తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions