Ambati Rambabu: ప్రచార ఆర్భాటాలు తప్ప చేస్తున్న పనులేమీ లేవు..
- సీఎం చంద్రబాబుపై మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు
- ఎవరు ఏమి చేసినా తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
- వైఎస్ఆర్ హయాంలో కోటి ఎకరాలు సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు
- ఏపీలో జలయజ్ఞం పేరిట 23 ప్రాజెక్టులు పూర్తి చేశారు- అంబటి రాంబాబు
- చంద్రబాబు అన్నీ నేనే చేశా అంటారు..-అంబటి రాంబాబు
- పోలవరం నాదే అంటారు.. హంద్రీనీవా నాదే అంటారు- అంబటి రాంబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ఎవరు ఏమి చేసినా తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో కోటి ఎకరాలు సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఏపీలో జలయజ్ఞం పేరిట 23 ప్రాజెక్టులు పూర్తి చేశారని అన్నారు. చంద్రబాబు అన్నీ నేనే చేశా అంటారు.. పోలవరం నాదే అంటారు.. హంద్రీనీవా నాదే అంటారు.. ఆయనకు ఉన్న మీడియా బలంతో అన్నీ నిజాలే అన్నట్లుగా చెప్పేసుకుంటాడని అంబటి రాంబాబు ఆరోపించారు. ఏ ప్రాజెక్టు అయినా వైఎస్ఆర్ శ్రద్ధతోనే వచ్చాయని తెలిపారు. వైఎస్ తర్వాత తిరిగి ఆయన తనయుడు జగన్ సీఎం అయిన తర్వాత మళ్ళీ పనులు మొదలు పెట్టారని అన్నారు.
గోదావరి, బనకచర్ల మూడు దశల్లో పూర్తి చేయాలనుకున్న మొదటి వ్యక్తి జగన్.. 280 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణకు తరలించేలా ప్రయత్నం చేసిన జగన్ అని అంబటి రాంబాబు చెప్పారు.
2024 Rewind: ఈ ఏడాది అరెస్టై జైలుకెళ్లిన సినీ, రాజకీయ ప్రముఖులు వీళ్లే!
Also Read
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
వైకుంఠపురం నుంచి లిఫ్ట్ చేసి బొల్లాపల్లి దగ్గర కలిసేలా పనులు.. దశల వారీగా సత్తెనపల్లి నియోజకవర్గం నరసింగపాడు దగ్గర కలిపేలా ప్రణాళిక.. బొల్లాపల్లి దగ్గర 150 టీఎంసీలతో రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని అంచనాలు ఉండేవని అంబటి రాంబాబు తెలిపారు. అయితే చంద్రబాబు మాత్రం అన్నీ తానే చేశా అని ముందుకు వచ్చారన్నారు. వారి ఆలోచనలే పెద్ద గేమ్ చేంజర్ అని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు.. బొల్లాపల్లి రిజర్వాయర్ 150 టీఎంసీలకు చేరితే వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన నల్లమల సాగర్ నీరు తరలించాలని ప్రణాళిక ఉందని అన్నారు. నల్లమల సాగర్ నుంచి బనకచర్ల వరకు 23 కిలోమీటర్ల టన్నెల్ తవ్వి పనులు చేయాలని అంచనాలు వేశాం.. గతంలో తమ ప్రణాళికలు అన్నీ కార్యరూపం దాల్చితే గోదావరి నుంచి వృధాగా వెళ్ళే జలాలు కృష్ణా నదిలోకి వెళ్తాయని చెప్పారు. ఈ అనుసంధానంతో వెనుకబడిన ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలు సస్య శ్యామలం అవుతాయని అంబటి పేర్కొన్నారు. 2022లో దీనికి సంబంధించిన డీపీఆర్లు సిద్ధం చేసి కేంద్రానికి పంపాం.. కేంద్ర అనుమతులు కోసం వేచి ఉన్నాం.. ఈ ప్రణాళికలను మొత్తం ఇవాళ చంద్రబాబు అన్నీ నేనే చేసానని చెప్పుకుంటున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.
Online Love: సరిహద్దు దాటిన ప్రేమ.. లవర్ కోసం పాకిస్తాన్ వెళ్లిన వ్యక్తి అరెస్ట్..
తెలుగుతల్లి జలహారతి అని పేరు కూడా పెట్టారు.. అన్నీ తన వారికే ఇవ్వాలని చంద్రబాబు యత్నం.. అన్నింటికీ కేంద్రం సుముఖత అన్న ప్రచారం.. కేంద్రమే ఇస్తే తాము ఉన్నప్పుడే చేసే వాళ్ళం కదా అని అంబటి రాంబాబు తెలిపారు. ప్రచార ఆర్భాటాలు తప్ప చేస్తున్న పనులు మాత్రం లేవని అన్నారు. ఆఖరికి రైతులను కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు చంద్రబాబు.. నీటి ప్రాజెక్టులను ప్రైవేట్ పరం చేస్తామనటం తానెప్పుడూ వినలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు లేరు కానీ.. ఉంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేవాళ్ళని విమర్శించారు.
ప్రతీ ఒక్కరూ చంద్రబాబు చెప్తున్న విషయాలు గమనించాలి.. దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం అని కొత్తగా కనిపెట్టిందేమీ లేదన్నారు. రెండు ఎకరాల నుంచి రెండు వేల కోట్లకు వెళ్లిన వ్యక్తి.. ఆయన ఆస్తులు ఎలా పెంచుకున్నారో అందరూ చూసారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఏడు నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!