Harish Rao : రేపు అసెంబ్లీకి కేసీఆర్.. హరీష్ రావు క్లారిటీ..!
- అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు
- కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ ఫైర్
- హౌస్ కమిటీలపై విమర్శలు
- ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్కు మాజీ మంత్రి హరీష్ రావు తెరదించారు. ఆదివారం జరిగిన ఒక చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారని అధికారికంగా స్పష్టం చేశారు. కేసీఆర్ రాకతో సభలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతామని ఆయన తెలిపారు.
కాంగ్రెస్కు అసెంబ్లీ అంటే వణుకు: అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీని నిర్వహించాలంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో సగటున ఏడాదికి 32 రోజుల పాటు సభను నడిపేవారమని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సగటును 20 రోజులకు తగ్గించిందని విమర్శించారు. ప్రజా సమస్యలు చర్చకు వస్తాయనే భయంతోనే సమావేశాల కాలాన్ని ప్రభుత్వం కుదిస్తోందని ఆయన ఆరోపించారు.
Also Read
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
తొలిసారిగా హౌస్ కమిటీలు లేవు: శాసనసభ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా, ప్రస్తుత ప్రభుత్వం హౌస్ కమిటీలను నియమించకుండా కాలయాపన చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సిన 18 కమిటీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అలాగే, తాము చర్చించాలని కోరుతూ ఎన్నో లేఖలు రాసినా, ఒక్క అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మైకులు కట్ చేయడం, మంత్రులు అడ్డుపడటం వంటివి ప్రజాస్వామ్యానికి విఘాతమని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం: ప్రస్తుత సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఐదు లక్షల కోట్ల కుంభకోణంగా తాము భావిస్తున్న నూతన హెల్త్ పాలసీపై సభలో లోతైన చర్చ జరగాలని కోరారు. అలాగే, గురుకుల పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏ అంశంపై చర్చకు సిద్ధమైనా తాము కూడా అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు స్పష్టం చేశారు.
Suvendu Adhikari: ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లే, బంగ్లాదేశ్కు గుణపాఠం చెప్పాలి..
తాజావార్తలు
-
India S-400 Squadron: భారత్కు రష్యా నుంచి నాలుగో S-400 స్క్వాడ్రన్.. దేశ వైమానిక రక్షణ మరింత పటిష్టం
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!