Harish Rao : రేపు అసెంబ్లీకి కేసీఆర్.. హరీష్ రావు క్లారిటీ..!
- అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు
- కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ ఫైర్
- హౌస్ కమిటీలపై విమర్శలు
- ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్కు మాజీ మంత్రి హరీష్ రావు తెరదించారు. ఆదివారం జరిగిన ఒక చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారని అధికారికంగా స్పష్టం చేశారు. కేసీఆర్ రాకతో సభలో ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతామని ఆయన తెలిపారు.
కాంగ్రెస్కు అసెంబ్లీ అంటే వణుకు: అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీని నిర్వహించాలంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో సగటున ఏడాదికి 32 రోజుల పాటు సభను నడిపేవారమని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ సగటును 20 రోజులకు తగ్గించిందని విమర్శించారు. ప్రజా సమస్యలు చర్చకు వస్తాయనే భయంతోనే సమావేశాల కాలాన్ని ప్రభుత్వం కుదిస్తోందని ఆయన ఆరోపించారు.
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
తొలిసారిగా హౌస్ కమిటీలు లేవు: శాసనసభ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా, ప్రస్తుత ప్రభుత్వం హౌస్ కమిటీలను నియమించకుండా కాలయాపన చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాల్సిన 18 కమిటీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అలాగే, తాము చర్చించాలని కోరుతూ ఎన్నో లేఖలు రాసినా, ఒక్క అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మైకులు కట్ చేయడం, మంత్రులు అడ్డుపడటం వంటివి ప్రజాస్వామ్యానికి విఘాతమని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం: ప్రస్తుత సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఐదు లక్షల కోట్ల కుంభకోణంగా తాము భావిస్తున్న నూతన హెల్త్ పాలసీపై సభలో లోతైన చర్చ జరగాలని కోరారు. అలాగే, గురుకుల పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న విద్యార్థుల మరణాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏ అంశంపై చర్చకు సిద్ధమైనా తాము కూడా అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు స్పష్టం చేశారు.
Suvendu Adhikari: ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లే, బంగ్లాదేశ్కు గుణపాఠం చెప్పాలి..
తాజావార్తలు
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!