తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్లో పనిదినాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇది ప్రజా సమస్యలపై చర్చను నీరుగార్చడమేనని ఆయన ఆరోపించారు. ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవానికి సభ నడిచేది వారం రోజులు కూడా ఉండదని హరీష్ రావు పేర్కొన్నారు. సమావేశాల మధ్యలో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వంటి పండుగలతో పాటు…
Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే వార్తలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. జగిత్యాల నుంచి 11 సార్లు పోటీ చేసి ఆరు సార్లు విజయం సాధించిన ఆయన, పార్టీలో తనకు దక్కుతున్న ప్రాధాన్యతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ వైఖరిని బహిరంగంగానే తప్పుబడుతున్న జీవన్ రెడ్డి, ఇప్పుడు తన రాజకీయ ప్రయాణాన్ని బీఆర్ఎస్ (BRS) వైపు మళ్లించేందుకు సిద్ధమైనట్లు…
KTR : రాష్ట్ర రాజకీయాల్లో డ్రగ్స్ అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీటుగా స్పందించారు. తనపై వస్తున్న అనుమానాలను పటాపంచలు చేసేందుకు ఎలాంటి పరీక్షలకైనా తాను సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలని, ఆయనకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలంటూ మహేశ్ గౌడ్ చేసిన సూచనను కేటీఆర్ స్వాగతించారు.…
మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ‘మింగడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేసిన ఆయన, రాష్ట్ర ఖజానాలో ప్రజా హామీలకే నిధులు లేనప్పుడు మూసీ ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. గతంలో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ నిర్మాణం గురించి ప్రెజెంటేషన్ ఇస్తే,…
Jeevan Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటుచేసుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. హస్తం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి (T. Jeevan Reddy) త్వరలోనే కాంగ్రెస్కు రాజీనామా చేసి, బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ జెండా మోసిన ఒక…
ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు క్లీన్ షీట్ ఇచ్చిన వేళ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీ నాయకత్వంపై యుద్ధం ప్రకటించారు. లిక్కర్ కేసు కారణంగానే బీఆర్ఎస్ రెండు ఎన్నికల్లో ఓడిపోయిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ ఓటమికి బాధ్యతను తన మీదకు తోసేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ, అసలు ఓటమికి దారితీసిన పరిస్థితులను బహిరంగంగా విశ్లేషించారు. లిక్కర్ కేసు వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న వాదనలో అసలు లాజిక్ లేదని…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు నుంచి క్లీన్ షీట్ లభించిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు తనకు శుభాకాంక్షలు చెబుతూనే, మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణమని కేటీఆర్ ట్వీట్ చేయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమిని తన మెడకు చుట్టాలని చూడటం సరికాదని హితవు పలికిన కవిత, అసలు తనపై ఈ కేసు పెట్టింది…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వెలువడిన తాజా తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (X) వేదికగా తీవ్రంగా స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, అలాగే బీఆర్ఎస్ నాయకులను బద్నాం చేయడానికి ఈ అక్రమ కేసును సృష్టించారని ఆయన మండిపడ్డారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనదని కేటీఆర్ విమర్శించారు. కేవలం రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతోనే ఈ కథనాన్ని అల్లారని, దీనివల్ల అసెంబ్లీ, పార్లమెంట్…
ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో రెండు రోజుల క్రితం రెవెన్యూ , మున్సిపల్ అధికారులు తొలగించిన గుడిసెల ప్రదేశాన్ని ఆయన స్వయంగా సందర్శించారు. పేదలు వేసుకున్న ఆశ్రయాలను కనికరం లేకుండా తొలగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెల తొలగింపుతో రోడ్డున పడ్డ బాధితులు కేటీఆర్ను కలవగానే తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను ముందస్తు సమాచారం లేకుండానే ఖాళీ చేయించడంపై కన్నీటిపర్యంతమయ్యారు.…
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మున్సిపల్ పీఠాలను దక్కించుకునే క్రమంలో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సోమవారం (ఫిబ్రవరి 16) నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. మున్సిపల్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఆందోళనలు, కౌన్సిల్ హాల్లో సభ్యుల మధ్య నెలకొన్న గందరగోళం వల్ల సభ నియంత్రణలో లేదని, అందుకే ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఆర్డీఓ ప్రకటించారు. Tollywood : టాలీవుడ్ డెబ్యూకి బాలీవుడ్…