Home
Brs Party
Brs Party News
-
Harish Rao: “వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి”.. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
Harish Rao: రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని మాజీ మంత్రి హరీష్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఎన్నికల వేళ చెప్పిందొకటి.. అధికారంలోకి వచ్చాక చేసేదొకటి.. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అంటూ లేఖలో పేర్కొన్నారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తా అన్న సీఎం రేవంత్ రెడ్డి.. వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్లి చూడాలని కోరారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం కుప్పలు… -
KCR : తెలంగాణ పునర్నిర్మాణ పోరాటం మళ్ళీ చేయాల్సిందే
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అన్నీ కోల్పోయామని బాధపడుతున్నారని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం మరోసారి పోరాడాల్సిన సమయం వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. జగిత్యాల బహిరంగ సభలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 1.7 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని కేసీఆర్ గుర్తు చేశారు. “కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏదైనా చేస్తారని ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాను. కానీ, వీళ్లు ఒక్కటంటే ఒక్కటైనా నిర్మాణాత్మకమైన పని చేశారా?” అని… -
KCR : పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా..? కేసీఆర్ సావాలి అంటున్నారు.. నేను సావను..
జగిత్యాల వేదికగా జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తన మరణం కోరుకుంటున్న వారికి తనదైన శైలిలో సమాధానమిస్తూనే, రాష్ట్రంలో ప్రస్తుత పాలనలోని వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. “ఒకప్పుడు అసెంబ్లీలో తెలంగాణ అనే పదం వాడటానికే వీల్లేకుండా రూలింగ్ ఇచ్చేవారు. బషీర్ బాగ్ కాల్పుల్లో రైతులు చనిపోయినప్పుడు భరించలేక పార్టీ పెట్టి బయలుదేరాను. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చావు నోట్లోకి వెళ్లి రాష్ట్రాన్ని సాధించాను”… -
KCR : జీవన్ రెడ్డి కి గులాబీ కండువా కప్పి BRS లోకి ఆహ్వానించిన కేసీఆర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి అధికారికంగా బీఆర్ఎస్ (BRS) గూటికి చేరారు. జగిత్యాలలో నిర్వహించిన భారీ ‘ప్రజా ఆశీర్వాద సభ’ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జగిత్యాల పార్టీ కార్యాలయం నుండి కేసీఆర్ భారీ కాన్వాయ్తో సభా ప్రాంగణానికి బయలుదేరారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం… -
Jeevan Reddy : కేసీఆర్ను కలిసిన జీవన్ రెడ్డి..
తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న ఇద్దరు దిగ్గజ నేతలు.. ఒకరు ఉద్యమ నాయకుడు కేసీఆర్, మరొకరు రైతు పక్షపాతి జీవన్ రెడ్డి. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు నేతలు ఒక్కటవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. శుక్రవారం నాడు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు , పార్టీ ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ నివాసంలోకి అడుగుపెట్టిన జీవన్ రెడ్డిని చూడగానే గులాబీ… -
Kavitha : BRSలో కలవరానికి కారణమవుతున్న కవిత మాటలు
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత సొంతంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేశారు. అయితే, ఆమె పెట్టబోయే పార్టీ పేరుపై ఇన్నాళ్లూ సాగిన ఉత్కంఠకు తెర దించుతూ కవిత చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కొత్త పార్టీ పేరు గురించి మొదటిసారి నోరు విప్పిన కవిత, తన పార్టీ “పాత… -
Harish Rao : అసెంబ్లీ వారం రోజులు కూడా నడవదు
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్లో పనిదినాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇది ప్రజా సమస్యలపై చర్చను నీరుగార్చడమేనని ఆయన ఆరోపించారు. ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవానికి సభ నడిచేది వారం రోజులు కూడా ఉండదని హరీష్ రావు పేర్కొన్నారు. సమావేశాల మధ్యలో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి వంటి పండుగలతో పాటు… -
Jagityal : పార్టీ మారుతానని జీవన్ రెడ్డి సిగ్నల్స్ .. పట్టించుకోని కాంగ్రెస్ ?
Jeevan Reddy: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే వార్తలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. జగిత్యాల నుంచి 11 సార్లు పోటీ చేసి ఆరు సార్లు విజయం సాధించిన ఆయన, పార్టీలో తనకు దక్కుతున్న ప్రాధాన్యతపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ వైఖరిని బహిరంగంగానే తప్పుబడుతున్న జీవన్ రెడ్డి, ఇప్పుడు తన రాజకీయ ప్రయాణాన్ని బీఆర్ఎస్ (BRS) వైపు మళ్లించేందుకు సిద్ధమైనట్లు… -
KTR : డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం.. ప్రజాప్రతినిధులంతా ముందుకు రావాలి
KTR : రాష్ట్ర రాజకీయాల్లో డ్రగ్స్ అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీటుగా స్పందించారు. తనపై వస్తున్న అనుమానాలను పటాపంచలు చేసేందుకు ఎలాంటి పరీక్షలకైనా తాను సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలని, ఆయనకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలంటూ మహేశ్ గౌడ్ చేసిన సూచనను కేటీఆర్ స్వాగతించారు.… -
KTR : మూసీ మీద 15 బ్రిడ్జిలు.. బీఆర్ఎస్ ప్లానింగ్ చెప్పిన కేటీఆర్
మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ‘మింగడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేసిన ఆయన, రాష్ట్ర ఖజానాలో ప్రజా హామీలకే నిధులు లేనప్పుడు మూసీ ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. గతంలో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ నిర్మాణం గురించి ప్రెజెంటేషన్ ఇస్తే,…
తాజావార్తలు
-
Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..
-
Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్పై బీసీసీఐ కఠిన చర్యలు.?
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!