Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేయింబవళ్లు కష్టపడి, పుస్తకాలతో కుస్తీ పట్టి, అన్ని అర్హతలూ ఉండి కూడా ఉద్యోగం రాక లక్షలాది మంది నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ, తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న అర్హులైన అభ్యర్థుల జీవితాలతో ఫేక్ కేటగిరీ గాళ్లు చెలగాటమాడుతున్నారు. దొంగ సర్టిఫికెట్లు, అక్రమ మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతూ, అర్హత ఉన్న నిజమైన నిరుద్యోగుల పొట్టకొడుతున్నారు. కష్టపడి చదివిన వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టి, అక్రమార్కులు పబ్బం గడుపుకోవడం సమాజానికి తీరని చేటు చేస్తోంది.
ఈ క్రమంలో నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లుగా ఉద్యోగాలు పొందిన 37 మందికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఈ నోటీసులకు తగిన వివరణ ఇవ్వాలని, వారు ఇచ్చే సమాధానాల ఆధారంగానే తదుపరి కఠిన చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. గతంలో కూడా ఇటువంటి నకిలీ సర్టిఫికెట్లతో దొరికిన 15 మందికి పైగా సిబ్బందిని ఇంటర్ బోర్డు ఇప్పటికే ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేసింది.
Also Read
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
మరోవైపు.. ఆర్థిక శాఖ పరిధిలోని ఐఎఫ్ఎమ్ఐఎస్ (IFMIS) ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల ఆధార్, ఉద్యోగ వివరాల ధృవీకరణను ప్రభుత్వం వేగవంతం చేసింది. డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టి ఒకే ఆధార్ ఆధారంగా రెండు వేర్వేరు ప్రభుత్వ సంస్థల నుంచి అక్రమంగా జీతాలు పొందుతున్న మోసాలను అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో దాదాపు 40 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఒకే సమయంలో రెండు శాఖల నుంచి రెండు జీతాలు డ్రా చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి.
ఇలాంటి డూప్లికేట్ మ్యాపింగ్లపై ప్రత్యేక విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అక్రమంగా జీతాలు పొందిన వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భావిస్తోంది. అన్ని శాఖలు తక్షణమే విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ఈ అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
-
Rahul Gandhi: ‘ఓటు చోరీ’ తర్వాత ఇప్పుడు ‘పార్టీ చోరీ’.. ఈసీపై రాహుల్ గాంధీ ఫైర్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
-
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!