Suvendu Adhikari: ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లే, బంగ్లాదేశ్కు గుణపాఠం చెప్పాలి..
- ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లే, బంగ్లాదేశ్కు గుణపాఠం చెప్పాలి..
- మహ్మద్ యూనస్కు మమతా బెనర్జీకి పెద్ద తేడా లేదు..
- బీజేపీ నేత సువేందు అధికారి ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suvendu Adhikari: బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల హత్యలు, దాడులపై పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లే, భారత్ కూడా బంగ్లాదేశ్కు గుణపాఠం నేర్పాలి’’ అని అన్నారు. శుక్రవారం రోజు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. మన 100 కోట్ల హిందువులు, హిందువుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్కు గుణపాఠం నేర్పినట్లే, బంగ్లాదేశ్కు బుద్ధి చెప్పాలని అన్నారు.
Read Also: Pakistan: “అవును, నూర్ఖాన్ ఎయిర్బేస్పై భారత్ దాడి చేసింది”.. అంగీకరించిన పాకిస్తాన్..
Also Read
బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత, భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాది హత్య తర్వాత ఆ దేశంలో హిందువుల్ని టార్గెట్ చేశారు. మైమన్సింగ్ జిల్లాలో 25 ఏళ్ల విస్త్ర కర్మాగార కార్మికుడు దీపు చంద్రదాస్ ను కొట్టి చంపారు. ప్రజలంతా చూస్తుండగా అతడి నగ్న మృతదేహాన్ని తగలబెట్టారు. ఆ తర్వాత రాజ్బరి జిల్లాలో మరో హిందూ వ్యక్తి అమృత్ మండల్ను మూకదాడిలో హతమార్చారు. దీనిపై భారత్తో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే, సువేందు అధికారి వ్యాఖ్యలపై అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్పందించింది. వారు ద్వేషం, అసహనాన్ని పద్ధతిగా మార్చుకున్నారని, ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లు, ముస్లింలకు భారత్ గుణపాఠం చెప్పాలని ప్రకటిస్తోందని ఆరోపించింది.
బంగ్లాదేశ్ హింసపై బంగ్లా డిప్యూటీ హైకమిషన్ను కలిసిన సువేందు అధికారి మాట్లాడుతూ.. హిందువుల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? అని ప్రశ్నించినట్లు చెప్పారు. బంగ్లాలో 2 కోట్ల మంది హిందువులు నిరంతరం టార్గెట్ అవుతున్నారని, భారత్లో ఉన్న 100 కోట్ల మంది హిందువులు నిశ్శబ్ధంగా కూర్చుని చూస్తారని వారు భావిస్తే, తప్పుగా భావించినట్లే అని ఆయన అన్నారు. మహ్మద్ యూనస్ పాలనకు, బెంగాల్లో మమతా బెనర్జీ పాలనకు ఏం తేడా లేదని ఆరోపించారు. అయితే, సువేందు అధికారి వ్యాఖ్యలపై అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్పందించింది. వారు ద్వేషం, అసహనాన్ని పద్ధతిగా మార్చుకున్నారని, ఇజ్రాయిల్ గాజాలో చేసినట్లు, ముస్లింలకు భారత్ గుణపాఠం చెప్పాలని ప్రకటిస్తోందని ఆరోపించింది.
తాజావార్తలు
-
Sanjeev OTT Release: 4 రోజుల్లో సినిమా.. ఏడు అవార్డులు.. ఓటీటీలోకి వస్తున్న ‘సంజీవ్’
-
Iran War: అమెరికాకు ఇరాన్ షాక్.. కూల్చిన F-15E శకలాలను ప్రపంచానికి చూపించింది.!
-
Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
-
CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
-
Chennai: ఏడేళ్ల నాటి మర్డర్ మిస్టరీ వీడింది.. చంపిందెవరంటే..!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!