ఏపీలో పార్టీ విస్తరిస్తామన్న సీఎం కేసీఆర్కు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. నాడు-నేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చామని, టీఆరెస్ పాలనలో ఒక్కటైనా మార్చారా అంటూ ఫైరవుతున్నారు. మొన్న సీఎం కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు… ఇప్పుడు హాట్ టాపిగ్గా మారాయ్. ఏపీలోనూ పార్టీ పెట్టాలంటూ ఆహ్వానాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి కామెంట్లపై స్పందిస్తున్నారు ఏపీ మంత్రులు. తెలంగాణ కంటే ఏపీలోనే పాలన బాగుందని కితాబిచ్చుకుంటున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్ల టాయిలెట్స్ ఎలా ఉన్నాయో.. ఏపీలోని ప్రభుత్వ స్కూళ్ల…
క్రెడాయ్ ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. బిల్డింగ్ ప్లాన్ పర్మిషన్ గడువును పొడిగించాలని క్రెడాయ్ ప్రతినిధులు మంత్రికి విన్నవించారు. టీడీఆర్ బాండ్ల జారీ.. వాటి కాల పరిమితి.. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఎల్ఆర్ఎస్ అమలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం, ఆన్ లైన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను క్రెడాయ్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. వీటిపై స్పందించిన…
ఏపీలో రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం నిధులను మంగళవారం జగన్ విడుదల చేశారు. వర్చువల్ పద్ధతిలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. మూడో ఏడాది రెండో విడత…
రైతులకు సంబంధించి ఒకే రోజు 3 పథకాలను సీఎం జగన్ అమలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి, కన్నబాబు అన్నారు. ప్రతి రైతు సంతృప్తిగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎన్నికల్లో ఇచ్చిన మాటను వంద శాతం నెరవేర్చుతూ సీఎం జగన్ వాగ్దానాలను నిలబెట్టుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు రూ. 18,775 కోట్లు వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ప్రభుత్వం నచ్చిందన్నారు. ఢిల్లీ వీధుల్లో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం…
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి నుంచి రేషన్ దిగుమతి, పంపిణీ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది రేషన్ డీలర్ల సంఘం. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని అలాగే… డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. డీలర్ల నుంచి ఐసీడీఎస్కు మళ్ళించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు డీలర్లు.2020 మార్చి 29 నుంచి ఇప్పటి వరకు ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ బకాయిలు చెల్లించాలన్నారు.…
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీలు బూతు పురాణాల రాజకీయంతో జనాలకు అసహ్యం వేస్తుంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ కొడాలి నాని, వల్లభనేని వంశీని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత ఉద్దేశించి వల్లభనేని వంశీ, కొడాలి నాని పశువులకన్నా హీనంగా మాట్లాడారు… జగన్ అరాచక పాలనపై మేము మా నాయకుడు చంద్రబాబు నాయడు మాట్లాడితే మాపై శాపనార్థాలు పెడతారా అంటూ దేవినేని ఉమ…
కడపజిల్లా బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం రాజకీయ పార్టీల బాధ్యత అని, తమకు ప్రజా బలం ఉందని, పోలీసులు అవసరం లేదన్నారు. కేంద్రంలో అధికారం ఉందన్న గర్వంతో బీజేపీ ప్రజలను ఓట్లు అడగకుండా పత్రిక సమావేశాలకు పరిమితమై పోయిందన్నారు. ప్రభుత్వం పై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రజల్లోకి వెళ్లి…
బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే మరణంతో ఏపీలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో వైసీపీ తరుఫున దివంగత బద్వేల్ మాజీ ఎమ్మెల్యే సతీమణి బరిలో ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉండటంతో ఇక్కడ వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడకే అన్న చందంగా మారింది. ఓటమిని ముందుగానే గుర్తించిన టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే ఇక్కడ పోటీ నుంచి తప్పుకున్నాయి. అనుహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ రేసులో నిలువడంతో ఎన్నిక అనివార్యమైంది.…
ఢిల్లీః రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ ను టీడీపీ అధినేత ఎన్. చంద్ర బాబు నాయుడు కలిశారు. ఈ సందర్భంగా 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతి కి అందజేశారు చంద్రబాబు. ఏపీ లో మాదక మాదకద్రవ్యాల నెట్ వర్క్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని… రాష్ట్రంలో తక్షణం ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని ఈ సందర్భంగా రాష్ట్రపతిని కోరారు చంద్రబాబు.. అలాగే… .అక్టోబర్ 19 న జరిగిన ఘటనల పై…
భార్య రాజకీయంగా కీలక పదవిలో ఉంటే… భర్త పెత్తనం చేయడం చాలాచోట్ల చూస్తుంటాం. ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఆ మున్సిపల్ కార్పొరేషన్లోనూ అదే జరుగుతోందట. ఆయన పర్మిషన్ ఇస్తేనే ఫైల్ కదులుతోందని పార్టీ కేడర్.. అధికారులు కోడై కూస్తున్నారు. దేవుడు వరమిచ్చినా.. ఆయన కరుణ లేకపోతే పనే కాదట. ఆ బాగోతం ఎక్కడో ఏంటో ఇప్పుడు చూద్దాం. షాడో మేయర్గా మారిన భర్త? షేక్ నూర్జహాన్. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్. వరసగా రెండోసారి…