కడప జిల్లా బద్వేల్ లో భారీ వర్షం కురుస్తోంది.. ఇవాళ వేకువ జాము నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. దీంతో బద్వేల్ పోలింగ్ పై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే… వర్షం లో నైనా పోలింగ్ సామాగ్రిని తీసుకెళుతుంది ఎన్నికల సిబ్బంది. ఎన్నికల సామాగ్రి తడవకుండా ఎన్నికల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షంలోనైనా… తమ డ్యూటీ ని సక్రమంగా నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే.. రేపు కూడా వర్షం బాగా పడితే.. పోలింగ్ శాతం తగ్గే…
త్వరలోనే రోడ్ల మరమ్మత్తులు.. నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆర్ అండ్బీ ముఖ్య కార్యదర్శి, ఎంటీ కృష్ణబాబు తెలిపారు. సీఎం సూచనల మేరకు ముందుగా రోడ్ల మరమ్మత్తులు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 2,205 కోట్లు కేటాయించింది. రోడ్లను బాగు చేసేందుకు నిధులను సమీకరిస్తున్నాం. రోడ్ సెస్ ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని ఎస్క్రో చేసి అప్పు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. 8,268 కి.మీ పొడవు రోడ్లను మెరుగుపరచడానికి.. 308 స్టేట్…
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వైసీపీ- టీడీపీ నేతల మధ్య విమర్శల మాటల దాడి, ప్రతి దాడులు కొనసాగుతుంటే దీనికి భిన్నంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే ఎన్నికల్లో గెలిచేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఆ పార్టీ బలంగా ఉన్న కోస్తా జిల్లాలో ఇక ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు సమాచారం. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కనీసం 40-50 స్థానాల్లో సర్వే చేయాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి టీడీపీతో జనసేన దోస్తీ కట్టనున్నట్లు వినికిడి.…
చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నల్గొండ ఎస్పీ రంగనాథ్ స్పందించారు. ఆయన ఆరోపణలు నిరాధారం అన్నారు. పోలీసులకు దురుద్దేశాలు ఆపాదించవద్దన్నారు. ఏవోబీలో గంజాయి సాగు అందరికీ తెలిసిందేనని, పక్కా సమాచారం మేరకే ఏవోబీలో దాడులు చేసినట్టు ఎస్పీ తెలిపారు. నల్గొండలో భారీగా గంజాయి పట్టుబడిందని గంజాయి నివారణకు అందరూ కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ రంగనాథ్ అన్నారు. పోలీసులకు రాజకీయాలతో ముడి పెట్టవద్దన్నారు.
ఇవాళ జరిగిన ఏపీ కేబినేట్ మీటింగ్లో చర్చించిన అంశాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై కెబినెట్లో ఎందుకు చర్చించ లేదు..? మాదకద్రవ్యాలు, గంజాయి ప్రస్తావన రాగానే దేశమంతా ఏపీ పేరే వినిపిస్తుంటే, కేబినేట్కు మాత్రం వినపడలేదన్నారు. ? లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఎయిడెడ్ విద్యాసంస్థలపై మంత్రివర్గం ఎందుకు చర్చించలేదు..? విశాఖలో స్వామీజీ ఆశ్రమానికి రైతులభూములు తక్కువ ధరకు అప్పగించడానికే ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించిందా?…
జగన్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే విద్యార్థుల కోసం అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన లాంటి పథకాలు తీసుకొచ్చి విద్యార్థులను ఆర్థికంగా ఆదుకుంటుంది. తాజాగా ఈ రెండు పథకాల డబ్బుకు బదులు ల్యాప్టాప్ కావాలని ఆప్షన్ ఇచ్చారు విద్యార్థులు. ఇలా ఆప్షన్లు ఇచ్చిన వారిలో 6.53 లక్షల మంది ఉన్నారు. తొమ్మిదో తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థులకు ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బు కాకుండా ల్యాప్టాప్లు కావాలని కోరిన విద్యార్థులకు వీటిని…
ఏపీ మంత్రి పేర్నినాని కేసీఆర్ ఫ్లీనరీ సందర్భంగా మాట్లాడిన మాటలపై స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన పేర్ని నాని కేసీఆర్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టాలని కోరుకుంటున్నామని, రెండు రాష్ట్రాలలో పార్టీ ఎందుకు, దానికన్నా తెలంగాణ క్యాబినెట్లో రెండు రాష్ట్రాలను కలిపే తీర్మానం ప్రవేశపెట్టాలని వ్యంగంగా మాట్లాడారు. కేసీఆర్కు ఏపీలో పార్టీ పెట్టాలని అంత కోరికగా ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్పై మీడియా సమావేశంలో మంత్రి పేర్ని…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకానికి ఇక నుంచి 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని మంత్రి పేర్ని నాని అన్నారు. నవంబర్ 8,2021 నుంచి ఏప్రిల్30,2022 వరకు సుమారు 130 రోజులు విద్యా సంవత్సరంగా ఉందని, ఇందులో ఖచ్చితంగా75 శాతం హాజరు ఉంటేనే అమ్మ ఒడి పథకానికి అర్హులు అవుతారని మంత్రి స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా కరోనా ఉండటంతో ఈ నిబంధనను అమలు చేయలేదని, ఇక నుంచి ఖచ్చితంగా అమలు…
వైసీపీ దిగజారిపోయింది అనడానికి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. తెలంగాణకు చెందిన పోలీస్ అధికారి అరకులో గంజాయి ఉందని నిరూపించడానికి ప్రయత్నించి భంగపడ్డాడన్నారు. పోలీస్ అధికారిని ఉద్దేశించి అలా మాట్లాడే బదులు, తాము గంజాయి అమ్ముతున్నామని విజయ సాయి చెప్పాల్సింది. ఆ పోలీస్ అధికారి టీడీపీ మనిషన్నట్లుగా కూడా విజయసాయి మాట్లాడారు. కేసీఆర్ కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, తనరాష్ట్ర పోలీస్ అధికారులతో చెప్పారు. అంతమాత్రాన కేసీఆర్…
వడ్డించేవాడు మనవాడే అయితే.. ఎక్కడున్నా ఫర్వాలేదు.. ఎంత తవ్వుకున్నా అడిగేవారు లేరని అనుకున్నారా? ఏకంగా 60 కోట్ల గ్రావెల్ను అమ్మేసుకున్నారా? మాఫియా మాయాజాలం పేరుతో కొండను గుల్లచేసి.. జేబులు నింపేసుకున్నవారు ఎంపీ అనుచరులా? ఆ మట్టి బాగోతం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎంపీ అనుచరులే మట్టిని తవ్వేశారా? నేలను చదును చేయడం అంటే.. ఎక్కడైనా రోడ్డుతో సమానంగా లేదా రోడ్డుకంటే కాస్త ఎక్కువగా పని పూర్తి చేస్తారు. కానీ.. తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో మాత్రం డిఫరెంట్.…