NTR-Neel: ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ – సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’. గత ఏడాది కాలంగా ఈ సినిమా కోసం తారక్ అభిమానులతో పాటు, సినిమా ప్రియులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవలే చిత్ర యూనిట్ జోర్డాన్లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. అక్కడ ఎన్టీఆర్ ఎటువంటి డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశారని సమాచారం. షెడ్యూల్ కంటే ముందుగానే చిత్ర బృందం షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు చేరుకున్న విషయం తెలిసిందే.
READ ALSO: Buying New AC Tips: ఎండలు మండిపోతున్నాయి.. ఏసీ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి..
ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘వార్ 2’ తర్వాత ఎన్టీఆర్తో ఆయన నటిస్తున్న రెండో సినిమా. ఈ విషయాన్ని అనిల్ కపూర్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. మలయాళ స్టార్ టొవినో థామస్ ఇందులో విలన్గా నటిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదే సమయంలో తాజాగా మరొకరు కూడా ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయబోతున్నారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ నటీ ఖుష్బూ సుందర్ ఈ ప్రాజెక్ట్లో భాగం అయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే నిజం అయితే ఖుష్బూ డ్రీమ్ తీరినట్లు అవుతుంది. పలు సందర్భాల్లో ఆమె మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో తనకు తారక్తో నటించాలనే కోరిక ఉందని బయటపెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
READ ALSO: David Reddy: ‘డేవిడ్ రెడ్డి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఉక్రెయిన్ భామ..