Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు భారత వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. భారత్ నుంచి ఎక్కువగా సరకులు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం, ఇరాన్ ‘‘హార్మూజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో సముద్ర రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో అటాక్ చేస్తోంది. గగనతలంపై కూడా నిషేధం విధించబడింది. ఈ పరిణామాల గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి ఎగుమతి కావాల్సి వస్తువులు పేరుకుపోతున్నాయి.
Read Also: Pakistan: “ఇజ్రాయిల్ తర్వాతి టార్గెట్ పాకిస్తాన్”.. ఇరాన్ యుద్ధంపై పాక్ నాయకుల భయం..
ముఖ్యంగా ఈ యుద్ధం భారత బాస్మతి వ్యాపారాన్ని దెబ్బతీసింది. 4 లక్షల టన్నుల బియ్యం చిక్కుకుపోయింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బాస్మతి బియ్యం ఎగుమతిదారు. ప్రస్తుతం రవాణాలో ఉన్న, అంతర్జాతీయ ఓడిరేవుల్లో ఉన్న బియ్యం చిక్కుకుపోయింది. ఇది ఎగుమతిదారులు, మిల్లర్లు, రైతులకు తీవ్ర ఇబ్బందులు తెస్తోంది.
భారత బాస్మతి బియ్యానికి మధ్యప్రాచ్యంలో మంచి డిమాండ్ ఉంది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ వంటి దేశాలు భారత బాస్మతి బియ్యానికి పెద్ద మార్కెట్గా ఉన్నాయి. ఈ దేశాలన్నీ కలిసి 50 శాతం ఎగుమతి వాటాను కలిగి ఉన్నాయి. విదేశీ డిమాండ్ అకస్మాత్తుగా తగ్గడంతో మార్కెట్ ప్రభావితం అవుతోంది. దేశీయ మార్కెట్లో బాస్మతి ధరల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ధరలు క్వింటాల్కు రూ. 1000 వరకు తగ్గాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ దీని వల్ల ఎక్కువ ప్రభావితం అవుతోంది. ఆ రాస్ట్రంలోని రైసెన్, నర్మాదాపురం వంటి జిల్లాల్లో ఎగుమతి ఆర్డర్లలో తగ్గుదల కనిపిస్తోంది.