Sandeshkhali Clashes: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ్ఖలీ ప్రాంతం అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని గుండాల అకృత్యాలపై అక్కడి మహిళలు, యువత భగ్గుమంటోంది. నేరస్తులను వెంటనే అరెస్ట్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలుపుతోంది. మరోవైపు ఈ అల్లర్ల వెనక ఆర్ఎస్ఎస్ ఉందని బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్కు చెందిన సందేశ్ఖాలీ లైంగిక వేధింపుల కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు చేయించాలని బాధితులు డిమాండ్ చేశారు.
Mimi Chakraborty: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత, మిమీ చక్రవర్తి తన ఎంపీ పదవకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నేతలతో విభేదాల కారణంగానే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
Sandeshkhali: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ అట్టుడుకుతోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్ అఘాయిత్యాలపై అక్కడి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళన, నిరసన కార్యక్రమాలకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఇటీవల ఉత్తర 24 పరగణాల్లోని సందేశ్ఖాలీ ప్రాంతంలో రేషన్ కుంభకోణం విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వెళ్తే, వారిపై షాజహాన్, అతని గుండాలు దాడులకు పాల్పడ్డారు.
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో "సందేశ్ఖాలీ" ప్రకంపనలు రేపుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షాజహాన్ షేక్, అతని అనుచరుల చేతిలో లైంగిక వేధింపులు, చిత్ర హింసలకు గురైన మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలుపుతోంది. సోమవారం గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మహిళలతో మాట్లాడారు. మహిళలు తాము ఎదుర్కొన్న అఘాయిత్యాలు., అన్యాయాల గురించి గవర్నర్ వద్ద వెల్లబోసుకున్నారు.
Yogi Adityanath: జ్ఞానవాపి మసీదు వివాదం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వారణాసి కోర్టు జ్ఞానవాపి సెల్లార్లో పూజలకు హిందువులను అనుమతించింది. దీనిపై పలువురు ముస్లిం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కి వార్నింగ్ ఇస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర బకాయిలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినందుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన చేపట్టనున్నారు. ముఖ్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) కింద కేంద్రం బకాయిలను నిలుపుదల చేసింది. దీంతో కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా ఇవాళ మమతా బెనర్జీ ఆందోళనకు పిలుపునిచ్చింది.
పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో రాహుల్ గాంధీ కారుపై ఆకస్మిక దాడి జరిగింది. ఇవాళ మధ్యాహ్నం బీహార్ నుంచి బెంగాల్లోని మాల్దాలోకి ప్రవేశిస్తుండగా రాహుల్ ప్రయాణిస్తున్న కారు అద్దంపై కొంత మంది రాళ్ల దాడి చేశారు.
CAA: కేంద్రమంత్రి, బీజేపీ నేత శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) అమలులోకి వస్తుందని ప్రకటించారు. రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్లోనే కాదు, భారత్ అంతటా CAA అమలు చేయబడుతుందని నేను హామీ ఇవ్వగలను అని చెప్పారు. బెంగాల్లోని దక్షిణ 24 పరగణాస్లోని కక్ద్వీప్ బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ ఈ హామీని ఇచ్చారు.