West Bengal: పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత షేక్ షాజహాన్ని సీబీఐకి అప్పగించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్ సందేశ్ఖాలీ లైంగిక ఆరోపణలు, భూకబ్జా, రేషన్ బియ్యం కుంభకోణాలనికి పాల్పడినట్లు ఇతడిపై ఆరోపణలు ఉన్నాయి. షాజహాన్కి సంబంధించిన మెటీరియల్ సీబీఐకి అందించడానికి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బెంగాల్ పోలీసులకు గడువు విధించింది.
PM Modi: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులను ఆవిష్కరిస్తున్నారు. రాబోయే 10 రోజుల్లో పీఎం మోడీ 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 కార్యక్రమాలకు హాజరుకాబోతున్నారు. సెమికండక్టర్ ప్రాజెక్టులతో సహా మల్టీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకస్థాపన చేయనున్నారు. నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా, హర్యానాలో ద్వారకా ఎక్స్ప్రెస్ వేని ప్రారంభించనున్నారు.
Pawan Singh: బీజేపీ లోక్సభ అభ్యర్థులు తొలి జాబితా కొన్ని వివాదాలకు కారణమవుతోంది. విద్వేష వ్యాఖ్యలు చేసే పలువురు నేతలకు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఇదిలా ఉంటే బీజేపీ ముఖ్యంగా టార్గెట్ చేసిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆ పార్టీకి దెబ్బపడింది. భోజ్పురి యాక్టర్, సింగర్ పవన్ సింగ్ని బెంగాల్ అసన్సోల్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థికిగా నిన్న బీజేపీ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది సమయానికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు పవన్ సింగ్ టార్గెట్గా…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని కృష్ణానగర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన టీఎంసీని అవినీతి పార్టీగా ఆరోపించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని 42 స్థానాలను గెలుచుకోవాలని రాష్ట్ర బీజేపీకి టార్గెట్ నిర్దేశించారు.
ప్రధాని మోడీ (PM Modi) రెండ్రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ వచ్చారు. హుగ్లీ, నదియా జిల్లాల్లో జరిగిన రెండు బహిరంగ సభల్లో పాల్గొని పలు ప్రభుత్వ పథకాలను మోడీ ప్రారంభించారు.
Live-in relationship: సహజీవనం విషాదంగా మారుతోంది. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వారు హత్యలకు గురవుతున్నారు. దేశ రాజధానిలో శ్రద్ధా వాకర్ హత్య ఈ కోవకే చెందుతుంది. ఆమె పార్ట్నర్ అఫ్తాబ్ పూనావాల అత్యంత కిరాతంగా శ్రద్ధాను హత్య చేయడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత నుంచి పలు సందర్భాల్లో లివ్ రిలేషన్లో ఉన్న మహిళలు హత్యలకు గురయ్యారు.
Mamata Banerjee: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ ధర పెంచవచ్చని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. గ్యాస్ ధర రూ. 2000 వరకు పెంచవచ్చని గురువారం అన్నారు. ‘‘బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే, వంటగ్యాస్ ధరలను రూ. 1500 లేదా రూ.2000 పెంచవచ్చు. మళ్లీ మనం మంటల్ని వెలిగించేందుకు కలపను సేకరించే పాత పద్ధతికి వెళ్లాల్సి ఉంటుంది’’ అని మమతా బెనర్జీ అన్నారు. ఝర్గ్రామ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ…
Sandeshkhali: సందేశ్ఖలీ లైంగిక వేధింపుల నిందితుడు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. 10 రోజుల కస్టడీ విధించింది. మరోవైపు టీఎంసీ అతడిని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇతడిని అరెస్ట్ చేయాలని కొన్ని వారాలుగా సందేశ్ఖలీలో మహిళలు, అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. వీరికి బీజేపీతో సహా పలు విపక్షాలు మద్దతు తెలిపాయి.
Calcutta High Court: పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ని ఎట్టకేలకు 50 రోజుల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. భూ కుంభకోణంలో విచారణ జరిపేందుకు వచ్చిన ఈడీ అధికారులపై ఇతని అనుచరులు దాడులకు తెగబడ్డారు. అంతే కాకుండా సందేశ్ఖలి ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీంతో బెంగాల్లోని సందేశ్ఖలిలో మహిళలు, యువత టీఎంసీ లీడర్లకు వ్యతిరేకంగా ఉద్యమించింది. 55 రోజుల పరారీ తర్వాత అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Sheikh Shahjahan: పశ్చిమబెంగాల్ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్పై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పదుల సంఖ్యలో కేసులు ఉండటంతో పాటు ఇటీవల సందేశ్ఖలీలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు అక్కడి ప్రజలు ఉద్యమించారు.