త్తగా ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ఈ రోజు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో పబ్లిక్ కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా నీటి అడుగున ప్రయాణించే మొదటి రైడ్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు క్యూలో నిల్చున్నారు.
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్ఖాలీ ఘటన నిందితుడు షేక్ షాజహాన్ టార్గెట్గా ఈడీ ఈ రోజు భారీ దాడులు నిర్వహిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ నేత షేక్ షాజహాన్ అరెస్ట్ తర్వాత ఈడీ, పారామిలిటరీ బలగాలు ఈ రోజు నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. మహిళా బలగాలను కూడా రంగంలోకి దింపారు. ఈడీ అధికారులు గురువారం ఉదయం 6.30 గంటలకు షేక్ షాజహాన్కి చెందిన ఇటుక బట్టితో పాటు ధమఖలీ అనే ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్నాయి.
సుప్రీంకోర్టులో పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. సందేశ్ఖాలీ కేసులో సీబీఐ విచారణకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన అప్పీల్ను ధర్మాసనం కొట్టివేసింది.
PM Modi: పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ, తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీఎంసీ వంశపారంపర్య రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష కూటమిలోని టీఎంసీ, కాంగ్రెస్ వంటి పార్టీలు తమ కుటుంబాల అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తు్న్నాయని విమర్శించారు. శనివారం సిలిగురిలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోడీ, మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ద్వారా టీఎంసీని…
West Bengal : పశ్చిమ బెంగాల్లో 18 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్యాంగ్ రేప్ నిందితుల్లో ఓ మైనర్ కూడా ఉన్నాడు.
Mamata Banerjee: మహిళలపై లైంగిక వేధింపులతో ఇటీవల బెంగాల్లోని సందేశ్ఖాలీ ప్రాంతం అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు ఉద్యమించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తృణమూల్ మాజీ నేత షేక్ షాజహాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ ఉదంతంపై ప్రధాని నరేంద్రమోడీ టీఎంసీ పార్టీ, సీఎం మమతా బెనర్జీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు.
కోల్కతాలో నిర్మించిన భారత మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. కోల్కతాలో భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో విభాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించనున్నారు, ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు దేశం పురోగతిని ప్రదర్శించే మైలురాయి ప్రాజెక్ట్గా భావించవచ్చు.
West Bengal: పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత షేక్ షాజహాన్ని సీబీఐకి అప్పగించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. బెంగాల్ సందేశ్ఖాలీ లైంగిక ఆరోపణలు, భూకబ్జా, రేషన్ బియ్యం కుంభకోణాలనికి పాల్పడినట్లు ఇతడిపై ఆరోపణలు ఉన్నాయి. షాజహాన్కి సంబంధించిన మెటీరియల్ సీబీఐకి అందించడానికి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బెంగాల్ పోలీసులకు గడువు విధించింది.
PM Modi: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులను ఆవిష్కరిస్తున్నారు. రాబోయే 10 రోజుల్లో పీఎం మోడీ 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 కార్యక్రమాలకు హాజరుకాబోతున్నారు. సెమికండక్టర్ ప్రాజెక్టులతో సహా మల్టీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు శంకస్థాపన చేయనున్నారు. నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా, హర్యానాలో ద్వారకా ఎక్స్ప్రెస్ వేని ప్రారంభించనున్నారు.
Pawan Singh: బీజేపీ లోక్సభ అభ్యర్థులు తొలి జాబితా కొన్ని వివాదాలకు కారణమవుతోంది. విద్వేష వ్యాఖ్యలు చేసే పలువురు నేతలకు బీజేపీ టికెట్ నిరాకరించింది. ఇదిలా ఉంటే బీజేపీ ముఖ్యంగా టార్గెట్ చేసిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆ పార్టీకి దెబ్బపడింది. భోజ్పురి యాక్టర్, సింగర్ పవన్ సింగ్ని బెంగాల్ అసన్సోల్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థికిగా నిన్న బీజేపీ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన వెలువడిన కొద్ది సమయానికే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు పవన్ సింగ్ టార్గెట్గా…