Lions: సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టిన అధికారికి ఝలక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు సింహాలకు అక్బర్, సీత (Akbar and Sita) అనే పేర్లు పెట్టడంపై పశ్చిమబెంగాల్లో ఎంత దుమారం చెలరేగిందో తెలిసిందే. విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాకుండా కలకత్తా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తంచేసింది. తాజాగా ఈ ఘటనలో ఓ ఫారెస్ట్ ఉన్నతాధికారిపై వేటు పడింది.
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని శిలిగుడి సఫారీ (Bengal Safari) పార్కులో అక్బర్, సీత పేర్లు కలిగిన మగ, ఆడ సింహాలను ఒకే ఎన్క్లోజర్లో ఉంచారు. వాటికి ఆ పేర్లు పెట్టడంపై విశ్వహిందూ పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే వాటికి పేర్లు మార్చాలని ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కాస్తా దుమారం చేలరేగడంతో త్రిపుర (Tripura) ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ రాష్ట్ర అటవీ వ్యవహారాల ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రబిన్ లాల్ అగర్వాల్పై (tripura Forest Officer Suspended) సస్పెన్షన్ వేటు వేసింది.
Also Read
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
- Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
జంతువుల మార్పిడి కార్యక్రమం కింద బెంగాల్ అధికారులు ఫిబ్రవరి 12న త్రిపురలోని సిపాహీజలా జూ పార్క్ నుంచి రెండు సింహాలను శిలిగుడి సఫారీ పార్కుకు తీసుకొచ్చారు. ఆడ, మగ సింహాలైన ఆ రెండు అక్బర్, సీత అనే పేర్లు కలిగి ఉన్నాయి. ఈ రెండింటిని ఒకే ఎన్క్లోజర్లో ఉంచారు. దీనిపై విశ్వహిందూ పరిషత్ (VHP) కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర అటవీశాఖ అధికారులే వాటికి ఆ పేర్లు పెట్టారని.. అవి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించింది. వెంటనే ఆడ సింహం పేరు మార్చాలని డిమాండ్ చేసింది.
దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. సింహాలకు ఆ పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అనవసర వివాదాలు ఎందుకు సృష్టిస్తారని ప్రశ్నించింది. వెంటనే వాటికి వేరే పేర్లు పెట్టాలని ఆదేశించింది. దీనిపై బెంగాల్ ప్రభుత్వం స్పందిస్తూ.. త్రిపుర నుంచి తీసుకొచ్చేటప్పటికే వాటికి ఆ పేర్లు ఉన్నాయని.. వాటిని మారుస్తామని కోర్టుకు తెలిపింది.
ఈ వ్యవహారం వివాదాస్పదమవడంతో త్రిపుర ప్రభుత్వం తాజాగా చర్యలకు దిగింది. రాష్ట్ర వైల్డ్లైఫ్ చీఫ్గా ఉన్న అగర్వాల్ను వివరణ కోరగా.. తాను ఆ పేర్లు పెట్టలేదని చెప్పారు. అనంతరం దర్యాప్తు చేపట్టగా.. బెంగాల్కు అప్పగించే సమయంలో డిస్పాచ్ రిజిస్టర్లో ఆయనే ఆ సింహాల పేర్లను అక్బర్, సీతగా నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో అగర్వాల్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..