Kishan Reddy : సమస్యల పరిష్కారం కోసం కిషన్ రెడ్డి బస్తీ బాట
- అధికారులను వెంటబెట్టుకొని బస్తీల్లో పర్యటన
- పేదల సంక్షేమం, స్థానిక సమస్యలపై దృష్టి
- సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బౌద్ధనగర్, సీతాఫల్మండి, మెట్టుగూడ డివిజన్ లలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బస్తీ వాసులతో కలిసి గల్లీల్లో కలియ తిరిగారు ఈ సందర్భంగా పేదల సంక్షేమం, స్థానికుల మౌలిక సమస్యలపై దృష్టి సారించి, ప్రజలను స్వయంగా కలుసుకుని సమస్యలు తెలుసుకున్నారు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో బస్తీల్లో జనాభా వేగంగా పెరుగుతోందని, ప్రతిరోజూ కొత్త కాలనీలు, కొత్త అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయని తెలిపారు. ప్రతి ఆరు నెలలకోసారి నగర స్వరూపమే మారిపోతోందని వ్యాఖ్యానించారు.
150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా విభజించి, ఒక్క కార్పొరేషన్ను మూడు ముక్కలుగా చేయడం వెనుక భారతీయ జనతా పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలనే అక్కసే కారణమని ఆరోపించారు. హైదరాబాద్ కోర్ సిటీని మజ్లిస్ పార్టీకి అప్పగించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేశాయని విమర్శించారు.
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
హైదరాబాద్కు తగినంత నీటిని తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎండాకాలం మొదలవడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎండాకాలం మొదలు ముందే హైదరాబాద్లో వర్షపు నీటి కాలువల్లో యుద్ధప్రాతిపదికన సిల్ట్ తొలగించాల్సి ఉండగా, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పేపర్ల మీద మాత్రం కాంట్రాక్టర్లు సిల్ట్ తీసినట్లు చూపించి, చెల్లింపులు చేసుకున్నారని ఆరోపించారు.
బస్తీల్లో కాలువల్లో పేరుకుపోయిన పూడికను కూడా తొలగించడం లేదని, దీని వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని తెలిపారు. హైదరాబాద్ ప్రజల సమస్యలను పరిష్కరించే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదే ఉందని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, పెండింగ్లో ఉన్న సమస్యలపై తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ పాలకవర్గం రద్దయిన నేపథ్యంలో, ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలను నేరుగా కలుసుకుంటూ, అధికారులతో కలిసి పాదయాత్రలు నిర్వహించి, సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా తాను నిరంతరం కృషి చేస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం.. కవితకు క్లీన్ చిట్
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!