కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చుట్టూ కష్టాలు చుట్టుముట్టుతున్నాయి. ఇప్పటికే వైద్యురాలి హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఆయనపై అనేక రకాలుగా అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా బెంగాల్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది
West Bengal: పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో ఆదివారం స్థానిక కాంగ్రెస్ నాయకుడి హత్య చోటు చేసుకుంది. ఉదయం తుపాకీ కాల్పులు, బాంబులు విసిరి కాంగ్రెస్ నాయకుడిని చంపినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన కాంగ్రెస్ నేతని షేక్ సైఫుద్దీన్గా గుర్తించారు. ఇతను మాణిక్చక్లోని గోపాల్ పూర్ ప్రాంతానికి చెందిన కీలక నేత.
Rape Attempt: అత్యాచారం ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేశారు. నిందితుడు నారాయణ్ తన నివాసంలో బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. అతను తన బంకురా నివాసంలో మూడు రోజుల పాటు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలి కుటుంబీకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాగా టీఎంసీ ఆయనను ట్రేడ్ యూనియన్ నుంచి సస్పెండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆర్జికర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై అత్యాచారం,…
Kolkata: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం, హత్య జరిగిన తర్వాత జూనియర్ డాక్టర్లు నిరసన చేస్తున్నారు. సాల్ట్ లేక్లోని స్వాస్త్య భవన్ వెలుపల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు (శనివారం) ఆకస్మికంగా సందర్శించారు.
Lady Macbeth of Bengal: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 'లేడీ మాక్బెత్ ఆఫ్ బెంగాల్' అంటూ సీఎం మమతాని పిలిచారు.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కోల్కతాలో జూనియర్ వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. విధులు బహిష్కరించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశించినా నిరసనలు కొనసాగించారు. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది.
Kolkata Doctor Case: కోల్కతా వైద్యురాలి ఘటన యావద్ దేశాన్ని షాక్కి గురిచేసింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత దారుణంగా మానభంగం చేసి, హత్య చేశారు. ఈ ఘటనలో సంజయ్ రాయ్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
West Bengal: కోల్కతాలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ సర్కార్, మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ప్రజలు ఇప్పటికీ అక్కడ ఆందోళనలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం, కోల్కతా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించాయని ఆరోపిస్తూ , కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే.…