Anil Ambani: రూ. 40,000 కోట్ల బ్యాంకు మోసం.. ED ముందు హాజరైన అనిల్ అంబానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ambani: అనిల్ అంబానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందర విచారణకు హాజరయ్యారు. గురువారం ఢిల్లీలోని ED ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయనను మనీ లాండరింగ్ కేసులో రెండోసారి ప్రశ్నిస్తున్నారు. రూ. 40,000 కోట్ల భారీ బ్యాంకు మోసం ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరుగుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నిరీక్షణకు ఇక సెలవు.. Motorola Edge 70 Fusion స్మార్ట్ ఫోన్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్!
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
ఈ కేసు ప్రధానంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM) సంస్థకు సంబంధించినది. బ్యాంకుల నుంచి తీసుకున్న భారీ రుణాలను విదేశీ అనుబంధ కంపెనీల ద్వారా మళ్లించినట్లు ED అనుమానిస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద అధికారులు అంబానీ స్టేట్మెంట్ ను నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 2025 ఆగస్టులో ఒకసారి విచారణకు హాజరైన ఆయనను ఇప్పుడు రెండోసారి ప్రశ్నించడం గమనార్హం. ఈ కేసులో భాగంగా RCOM మాజీ అధ్యక్షుడు పునీత్ గార్గ్ ను ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు.
Bangladesh: బంగ్లా అధ్యక్షుడిపై విమర్శలు.. అంటే, యూనస్ అరాచకాలు నిజమేనా..
ఇదిలా ఉండగా.. ED తాజాగా అంబానీకి చెందిన ముంబైలోని విలాసవంతమైన నివాసం ‘Abode’ను అటాచ్ చేయడానికి చర్యలు ప్రారంభించింది. సుమారు రూ. 3,716 కోట్ల విలువైన ఈ ఆస్తి ఈ కేసులో కీలక ఆధారంగా భావిస్తున్నారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ED ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. అంబానీకి చెందిన కంపెనీలపై ఉన్న పలు రుణ మోసం కేసులను ఈ SIT పరిశీలిస్తోంది. ముఖ్యంగా బ్యాంకు రుణాల చెల్లింపుల్లో అక్రమాలు, నిధుల మళ్లింపు వంటి అంశాలపై లోతైన విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!