West Bengal: బెంగాల్లో మరో దారుణం.. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న బాలికపై అత్యాచారం..
- వైద్యురాలి ఘటన మరవక ముందే బెంగాల్లో మరో దారుణం..
- ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న బాలికపై అత్యాచారం..
- కారులో ఎక్కించుకుని అఘాయిత్యం..
- ఘటనను మభ్యపెట్టేందుకు పోలీసులు చర్యలని బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: కోల్కతాలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ సర్కార్, మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ప్రజలు ఇప్పటికీ అక్కడ ఆందోళనలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం, కోల్కతా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించాయని ఆరోపిస్తూ , కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే, ఆర్ జీ కర్ సంఘటన మరవక ముందే బెంగాల్లో మరో ఘోరం జరిగింది. హుగ్లీలో ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. కారులో ఎక్కించుకుని అత్యాచారం చేసిన నిందితులు, ఆమెను అపస్మారకస్థితిలో రోడ్డు పక్కన పడేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. మైనర్ బాలిక హుగ్లీ జిల్లాలోని హరిపాల్ వద్ద చిరిగిన బట్టలతో అపస్మారస్థితిలో కనిపించింది. బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ఆమెను కారులో ఎక్కించుకున్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
Read Also: Uruku Patela Review: ఉరుకు పటేలా రివ్యూ.. థియేటర్లకు ఉరుకులు పెట్టించేలా ఉందా? లేదా?
బాలికను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు. దీనిపై బెంగాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ‘‘మెడికో లీగల్ ఒపీనియన్తో సహా ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో అనుమానితులను గుర్తించలేదు’’అని బెంగాల్ పోలీసులు ట్వీట్ చేశారు. బాలిక, ఆమె కుటుంబ గోప్యతను గౌరవించాలని అభ్యర్థించారు. పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే, ఈ ఘటనపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఆస్పత్రిని సీజ్ చేసి, మీడియాకు ప్రవేశాన్ని నిరాకరించారని, ఘటనను కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ‘‘మమతా బెనర్జీ పోలీసులు ఆసుపత్రిని చుట్టుముట్టారు, మీడియాకు ప్రవేశం లేదు మరియు స్థానిక టిఎంసి నాయకులు ఈ సంఘటన గురించి నివేదించబడకుండా చూసేందుకు చుట్టూ తిరుగుతున్నారు’’ అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా అన్నారు. పశ్చిమ బెంగాల్ మహిళలకు అత్యంత ‘‘అసురక్షిత ప్రాంతం’’గా ఉందని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!