West Bengal: బెంగాల్లో మరో దారుణం.. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న బాలికపై అత్యాచారం..
- వైద్యురాలి ఘటన మరవక ముందే బెంగాల్లో మరో దారుణం..
- ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న బాలికపై అత్యాచారం..
- కారులో ఎక్కించుకుని అఘాయిత్యం..
- ఘటనను మభ్యపెట్టేందుకు పోలీసులు చర్యలని బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: కోల్కతాలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ సర్కార్, మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. ప్రజలు ఇప్పటికీ అక్కడ ఆందోళనలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం, కోల్కతా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించాయని ఆరోపిస్తూ , కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే, ఆర్ జీ కర్ సంఘటన మరవక ముందే బెంగాల్లో మరో ఘోరం జరిగింది. హుగ్లీలో ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న 15 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. కారులో ఎక్కించుకుని అత్యాచారం చేసిన నిందితులు, ఆమెను అపస్మారకస్థితిలో రోడ్డు పక్కన పడేశారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. మైనర్ బాలిక హుగ్లీ జిల్లాలోని హరిపాల్ వద్ద చిరిగిన బట్టలతో అపస్మారస్థితిలో కనిపించింది. బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో ఆమెను కారులో ఎక్కించుకున్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
Read Also: Uruku Patela Review: ఉరుకు పటేలా రివ్యూ.. థియేటర్లకు ఉరుకులు పెట్టించేలా ఉందా? లేదా?
బాలికను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు. దీనిపై బెంగాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ‘‘మెడికో లీగల్ ఒపీనియన్తో సహా ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో అనుమానితులను గుర్తించలేదు’’అని బెంగాల్ పోలీసులు ట్వీట్ చేశారు. బాలిక, ఆమె కుటుంబ గోప్యతను గౌరవించాలని అభ్యర్థించారు. పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే, ఈ ఘటనపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఆస్పత్రిని సీజ్ చేసి, మీడియాకు ప్రవేశాన్ని నిరాకరించారని, ఘటనను కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ‘‘మమతా బెనర్జీ పోలీసులు ఆసుపత్రిని చుట్టుముట్టారు, మీడియాకు ప్రవేశం లేదు మరియు స్థానిక టిఎంసి నాయకులు ఈ సంఘటన గురించి నివేదించబడకుండా చూసేందుకు చుట్టూ తిరుగుతున్నారు’’ అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా అన్నారు. పశ్చిమ బెంగాల్ మహిళలకు అత్యంత ‘‘అసురక్షిత ప్రాంతం’’గా ఉందని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!