Telangana Education Commission : ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదు
- బోధన మాధ్యమంగా ఇంగ్లీష్ ఉండాలి
- త్రి భాషా విధానం అమలు చేయాలి
- విద్యార్థి కేంద్రంగా విద్యా విధానం ఉండాలి
- EAPCET రద్దు చేయాలి
- తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు....
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదని తెలంగాణ విద్యా కమిషన్ అభిప్రాయపడింది.. వారి పని తీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలని సూచించింది. తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి గురువారం సమర్పించింది. విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండాలని కమిషన్ సిఫార్సు చేసింది.
కమిషన్ నివేదికలోని ముఖ్యాంశాలు…
Also Read
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ఉపాధ్యాయుల పని తీరును ప్రతి అయిదేళ్లకోసారి అంచనా వేయాలి. దాని ఆధారంగా ఆ ఉపాధ్యాయునికి ఒక నివేదిక అందజేయాలి. పని తీరు మెరుగుపర్చుకోవడానికి అతనికి రెండేళ్లు సమయం ఇవ్వాలి. అప్పటికీ పని తీరు మెరుగుపడకపోతే అతనిని సర్వీసు నుంచి తొలగించాలి. పని తీరు మెరుగ్గా ఉంటే ప్రమోషన్లు ఇవ్వాలి.. అయితే ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి వీటిని వర్తింపచేయకూడదు. ఇక నుంచి నియమించే ఉపాధ్యాయులకు వర్తింపజేయాలి. డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యకేషన్ (D.EI.ED)ను రద్దు చేయాలి.. బీఎడ్ను పునర్వ్యవస్థీకరించి నర్సరీ నుంచి అయిదో తరగతి వరకు బీఎడ్ (ప్రైమరీ), 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బీఎడ్ (సెకండరీ) ఉంచాలి. ఇందుకు ఎన్సీటీఈతో సంప్రదించాలి.. బీఎడ్ విద్యార్థులకు పాఠశాలల్లో 150 రోజుల బోధనాభ్యసం తప్పని సరి చేయాలి..
బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ ఉండాలి.. నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు బోధన మాధ్యమం ఇంగ్లీష్ ఉండాలి. త్రిభాష విధానం ఒకటో తరగతి నుంచే అమలు చేయాలి. తెలుగు/ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ బోధించాలి.. పూర్వ ప్రాథమిక విద్యను (నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ) ప్రాథమిక పాఠశాలల్లో అందజేయాలి. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన బలమైన డిమాండ్ ఇది. పాఠశాల్లలో విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, వసతుల కల్పన, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు స్కూల్ డిస్ట్రిక్లను ఏర్పాటు చేయాలి. పాఠశాలల్లో వంట వండే మహిళలకు వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలి.. మధ్యాహ్న భోజన అంచనాలు, ప్రతిపాదనలు, చెల్లింపుల కోసం సమగ్ర సాఫ్ట్వేర్ వాడాలి..
IIT-JEE/ NEET కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను నియంత్రించేందుకు చట్ట సవరణ చేయాలి.. ఫీజులు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, తప్పుదారి పట్టించే ప్రకటనలపై నియంత్రణ అవసరం.. ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి వేరుగా పోటీ పరీక్షల కోచింగ్ను వేరు చేయాలి. 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలి.. EAPCET రద్దు చేసి ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాలు 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలి. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేయాలి. విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడానికి కనిష్ట ఉత్తీర్ణత శాతాన్ని 45 శాతానికి పెంచాలి..
విశ్వ విద్యాలయాల కార్యనిర్వాహక మండలిని పునర్నిర్మించాలి.. దానికి వైస్ ఛాన్సలర్ ఛైర్మన్గా ఉండాలి.. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకం రిటైర్డ్ ఛీప్ సెక్రటరీ, యూజీసీ నామిని, ముగ్గురు రిటైర్డ్ వైస్ చాన్సలర్లతో కూడిన సెర్చ్ కమిటీ ద్వారా పారదర్శకంగా జరగాలి.. యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయాలి… విద్యార్థుల నుంచి డిమాండ్ ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలి. లింగ్డో కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థుల ఎన్నికలు నిర్వహించాలి. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వ విద్యాలయం తరహాలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయాన్ని బహుళ-విభాగ విశ్వ విద్యాలయంగా అభివృద్ధి చేయాలి.. ప్రతి డిగ్రీ కాలేజీకి అనుబంధంగా 200 మంది అతి పేద విద్యార్థులకు హాస్టల్ను ఏర్పాటు చేయాలి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో (హైదరాబాద్ నగరం వెలుపల) తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఆదేశించారు. తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని రకాల వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం… pic.twitter.com/mnYbcsnoiz
— Telangana CMO (@TelanganaCMO) February 26, 2026
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!