Mamata Banerjee: బెంగాల్ వరదల వెనుక ‘కుట్ర’.. కేంద్రమే కారణం!
- బెంగాల్ లో వరదలు
- కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న సీఎం మమతా
- దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వదలకు కారణమని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో వరదలకు బాధ్యత వహించాలని అన్నారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డివిసి) డ్యామ్లను డ్రెడ్జింగ్ చేయడంలో కేంద్రం విఫలమైందని బెంగాల్ సీఎం ఆరోపించారు. దాని ఫలితంగా రాష్ట్రంలోని అనేక జిల్లాలు వరదలకు దారితీసిందన్నారు. మానవ నిర్మిత వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డివిసి) కారణమని సీఎం ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితి వెనుక కుట్ర ఉందని అన్నారు. డీవీసీ ఆనకట్టలు జార్ఖండ్-బెంగాల్ సరిహద్దులోని మైథాన్, పంచేట్ వద్ద ఉన్నాయి.
READ MORE: Kolkata: మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు బెంగాల్ సర్కార్ బిగ్ షాక్.. మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు
Also Read
- Shreyas Iyer: "అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం".. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
కాగా.. గురువారం పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని పష్కురాలో వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఆమె, కార్పొరేషన్తో అన్ని సంబంధాలను తెంచుకుంటానని హెచ్చరించారు. వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. మమతా బెనర్జీ మాట్లాడుతూ .. “ఇది వర్షం వల్ల సంభవించిన వరద కాదు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ డీవీసీ తన డ్యామ్ల నుంచి విడుదల చేసే నీరు. ఇది మానవ నిర్మిత వరద. కేంద్ర ప్రభుత్వం ఎందుకు డ్యామ్లను శుభ్రం చేయడం లేదు. నీటి నిల్వ సామర్థ్యాన్ని ఎక్కడ తగ్గించారు. ఇందులో పెద్ద కుట్ర ఉంది. మేము దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం ప్రారంభిస్తాం.” అని తెలిపారు. వరద బాధిత ప్రజలందరికీ తగిన సహాయ సామగ్రిని అందేలా చూసేందుకు చూస్తానన్నారు.
READ MORE: Jani Master: జానీ మాస్టర్ అరెస్ట్ .. పోలీసుల అధికారిక ప్రకటన
బెంగాల్-జార్ఖండ్ సరిహద్దులను 3 రోజుల పాటు బంద్..
బెంగాల్ జార్ఖండ్ సరిహద్దును 3 రోజుల పాటు మూసివేస్తామని మమతా బెనర్జీ తెలిపారు. డివిసితో అన్ని సంబంధాలను తెంచుకుంటానని కూడా మమత హెచ్చరించారు. “జార్ఖండ్ సరిహద్దు సమీపంలోని రోడ్లు మునిగిపోవడం ప్రారంభించాయి.. అందువల్ల జార్ఖండ్ నుంచి వచ్చే వాహనాలు వరద నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల, నేను జార్ఖండ్ సరిహద్దును మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటిస్తున్నాను.” అని ఆమె వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Astrology: శ్రావణ మాసానికి ముందే శని వక్రగతి.. ఈ 5 రాశుల వారికి సంవత్సరాంతం వరకు ధన యోగం!
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Censor Issues : జననాయగన్కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!