IND vs ZIM: బెన్నెట్ పోరాటం వృథా.. జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ZIM: వరల్డ్ కప్ సూపర్ 8 దశలో భాగంగా చెన్నైలోని స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసింది.
Student Sui*cide: ఓవైపు పేరెంట్స్.. మరోవైపు ప్రేమ.. ఎటు తేల్చుకోలేక!
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్ సంజూ శాంసన్ వేగంగా 24 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చాడు. అభిషేక్ శర్మ 55 పరుగులు, ఇషాన్ కిషన్ 38 పరుగులతో జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేసి స్కోరు వేగం పెంచాడు. చివర్లో హార్దిక్ పాండ్యా అర్ధ శతకం సాధించి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. తిలక్ వర్మ కూడా దూకుడుగా 44 పరుగులు చేసి భారత్కు మంచి స్కోరు అందించాడు. 256 పరుగులు టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక స్కోర్.
ZIM vs IND: టీమిండియా నయా రికార్డ్.. జింబాబ్వే టార్గెట్ ఎంతంటే?
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే తరఫున బ్రియాన్ బెన్నెట్ అద్భుతంగా ఆడాడు. అతడు చివరి వరకు అవుట్ కాకుండా 97 పరుగులు చేసి ఒంటరిగా పోరాడాడు. సికందర్ రాజా 31 పరుగులు చేసినా, మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అతడు కీలక సమయంలో మూడు వికెట్లు తీసి జింబాబ్వేను కట్టడి చేశాడు. ఇతర బౌలర్లు కూడా సమిష్టిగా రాణించి జింబాబ్వేను లక్ష్యానికి దూరంగా నిలిపారు.
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!