గురువారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు
తొలి వన్డేలో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుని జోరుమీదున్న టీమిండియా నేడు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో వన్డేలో శ్రీలంకతో తలపడనుంది. గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి.
శ్రీలంకతో జరిగిన తొలివన్డేలో టీమిండియా యువ పేసర్, కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు.