Virat Kohli: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024-25 ఎలైట్ గ్రూప్ D మ్యాచ్లో భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ రైల్వేస్తో ఆడుతున్నాడు. 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఢిల్లీ స్టేడియంకు చేరుకున్నారు. జనవరి 30, మొదటి రోజు ఆట ఉదయం సెషన్లో ఒక అభిమాని భద్రతా వలయాన్ని దాటుకొని మైదానం మధ్యలోకి చేరుకుని విరాట్ కోహ్లీ పాదాలను తాకాడు. ఇందుకు…
దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా స్టార్ ఆటగాళ్లంతా రంజీ బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ బరిలోకి దిగగా.. నేడు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్లు రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఆరంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూపు-డి చివరి రౌండ్లో రైల్వేస్తో ఢిల్లీ తలపడనుంది. 12 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరపున విరాట్ బరిలో దిగుతున్నాడు.…
2012 తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 30 నుంచి రైల్వేస్తో ప్రారంభం అయ్యే రంజీ మ్యాచ్లో ఢిల్లీ తరఫున విరాట్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ కోసం మంగళవారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మిగతా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ కూడా చేశాడు. 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతుండడంతో అందరి కళ్లు కోహ్లీపైనే ఉన్నాయి. విరాట్ ఆట చూసేందుకు ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. రోస్టర్ విధానంలో మూడు…
Venkatesh Prasad: టీమిండియా మాజీ సెలెక్టర్, కోచ్ వెంకటేష్ ప్రసాద్ ఆదివారం తన టాప్-5 భారతీయ క్రికెటర్ల జాబితాను తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ జాబితాలో అతను ఆధునిక క్రికెట్ దిగ్గజాలుగా చెప్పుకునే విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ, ధోనీ (MS Dhoni), జస్ప్రీత్ బుమ్రా (Bumrah) వంటి ఆటగాళ్లను చేర్చలేకపోయాడు. ఈ జాబితాను ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. వెంకటేష్ ప్రసాద్ తన…
Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. రైల్వేస్తో ఢిల్లీ ఆడనున్న చివరి గ్రూప్ మ్యాచ్కు తాను అందుబాటులో ఉన్నట్లు కోహ్లీ ప్రకటించాడు. జనవరి 30న రైల్వేస్తో ఢిల్లీ తలపడనుంది. ఇది ఇలా ఉండగా.. కోహ్లీ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్తో ఘజియాబాద్లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ ఢిల్లీకి మరోమారు ఆడబోతున్నాడు. 36 ఏళ్ల…
హైబ్రిడ్ మోడల్లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. టీమ్ ఇండియా కెప్టెన్ పగ్గాలను రోహిత్ శర్మకే అప్పగిస్తూ.. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ముఖ్యమైన టోర్నమెంట్కు యువ బ్యాట్స్మెన్ శుభ్మాన్ గిల్ను వైస్ కెప్టెన్గా నియమించారు. పవర్ ఫుల్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తిరిగి అరగేట్రం చేశాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న.. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
Kohli- Rahul: జనవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు.. తమ స్క్వాడ్లో ఇప్పటికే రిషభ్ పంత్తో పాటు విరాట్ కోహ్లీకి అవకాశం కల్పిస్తూ ఢిల్లీ క్రికెట్ సంఘం జాబితాను విడుదల చేసింది. కానీ, మెడ నొప్పితో కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడలేనని బీసీసీఐకి సమాచారం ఇచ్చినట్లు కథనాలు ప్రసారం అవుతున్నాయి.
Rishabh Pant: రాజ్కోట్లో జనవరి 23 నుంచి సౌరాష్ట్రతో జరగనున్న ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్కు భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి అశోక్ శర్మ మంగళవారం తెలిపారు. ఇకపోతే, పంత్ చివరిసారిగా 2017-2018 సీజన్లో రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడాడు. అయితే, ఈ రంజీ మ్యాచ్ కు ఢిల్లీ తరుపున టీమిండియా టాప్ బ్యాట్స్మెన్స్ లో ఒకరైన విరాట్ కోహ్లీ…
Adam Gilchrist: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ ఘాటు వ్యాఖ్యలు చేసాడు. టెస్ట్ ఫార్మాట్లో రోహిత్ పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అతని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ తన కెరీర్పై ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపాడు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్ట్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచుల్లో ఆరు…
Virat Kohli: క్రికెట్ లో గొప్ప గొప్ప విజయాలు సాధించిన విరాట్ కోహ్లీ ఎంత సక్సెస్ ఫుల్ ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. అయితే, ఎంత గొప్ప ఆటగాడైన అప్పుడప్పుడు ఫామ్ కోల్పోవడం పరిపాటే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా ఆ పరిస్థితులలో ఉన్నాడు. ఇకపోతే తాజాగా కోహ్లీ అతని భార్య అనుష్క శర్మతో కలిసి మరోసారి ప్రముఖ సాధువు ప్రేమానంద్ మహారాజ్ ను కలవడానికి బృందావన్ వెళ్లారు. గతంలో కూడా కోహ్లీ తన ఫామ్…