IPL 2025: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ!
- అత్యుత్తమ బ్యాట్స్మెన్లో విరాట్ కోహ్లీ ఒకడు
- 252 ఐపీఎల్ మ్యాచ్లలో 8,004 పరుగులు
- 17 సంవత్సరాలుగా ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ప్లేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లో విరాట్ కోహ్లీ ఒకడు. ముందు బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ అయినా.. పిచ్ ఏదైనా.. బౌలర్ ఎవరైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 252 ఐపీఎల్ మ్యాచ్లలో 8,004 పరుగులు చేయగా.. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత 17 సంవత్సరాలుగా ఒకే ఫ్రాంచైజీకి నిలకడగా ఆడుతున్న ఏకైక ప్లేయర్ కూడా కోహ్లీనే. ఐపీఎల్ 2025 మార్చ్ 22 నుంచి ఆరంభం కానుండగా.. విరాట్ 18వ సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2025 ద్వారా టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించడానికి విరాట్ అడుగు దూరంలో ఉన్నాడు.
టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కింగ్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. పొట్టి ఫార్మాట్లో విరాట్ 9 శతకాలు బాదగా.. అందులో 8 ఐపీఎల్, ఒకటి అంతర్జాతీయ క్రికెట్లో చేశాడు. 2022లో ఆసియా కప్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్పై అంతర్జాతీయ సెంచరీ బాదాడు. కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే.. 10 టీ20 సెంచరీలు సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టిస్తాడు. మొత్తంగా అత్యధిక టీ20 సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (22) అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ (11) రెండో స్థానంలో ఉండగా.. విరాట్ (9) మూడో స్థానంలో ఉన్నాడు.
Also Read
ఐపీఎల్ 2025 ఎడిషన్లో బాబర్ అజామ్ను అధిగమించడానికి విరాట్ కోహ్లీకి మంచి సువర్ణావకాశం ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కింగ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఆ జోరును ఐపీఎల్ 2025లో కూడా కొనసాగించాలని ఆశిస్తున్నాడు. విరాట్ జూన్ 2024లో అంతర్జాతీయాల టీ20 నుండి రిటైర్ అయ్యాడు. కానీ ఐపీఎల్ టోర్నీలో మాత్రం ఆడుతున్నాడు. ఈ ఎడిషన్లో కొత్త రికార్డులు సృష్టించి.. బెంగళూరు టైటిల్ కరువును తీర్చాలని విరాట్ చూస్తున్నాడు. ఫాన్స్ కూడా బెంగళూరు కప్ కొట్టాలని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!