Champions Trophy: భారత్ గ్రాండ్ విక్టరీ.. అనుష్కకు కోహ్లీ విన్నింగ్ హగ్..
- ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ గ్రాండ్ విక్టరీ
- అనుష్కకు కోహ్లీ విన్నింగ్ హగ్
- ఇద్దరూ కలిసి టైటిల్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫైనల్ లో న్యూజీలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మూడోసారి గెలుచుకున్న జట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ రెండోసారి ICC ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంలో జట్టులోని ఆటగాళ్లు అందరు కీలక పాత్ర పోషించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్టంప్స్ తీసుకుని గ్రౌండ్ లో దాండియా నృత్యం చేశారు. విజయం తర్వాత కోహ్లీ తన భార్య అనుష్క శర్మ వద్దకు వెళ్లి ఆమెను కౌగిలించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.
Also Read:IND vs NZ: రోహిత్ ఖాతాలో మరో “హిట్టు”.. భారత్ ఘన విజయం..
Also Read
- IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
- IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
- IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
- Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. 'సూరీడు' కమ్బ్యాక్ అవుతాడా?
హగ్ చేసుకున్న తర్వాత ఆటగాళ్లు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న మైదానానికి అనుష్కను తీసుకువచ్చాడు. టీమిండియా విజయం తర్వాత విరాట్, అనుష్క మధ్య ఒక ప్రేమకథ కనిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను చూసేందుకు అనుష్క శర్మ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి వచ్చింది. భారత్ గెలుపు తర్వాత విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గ్యాలరీ నుంచి దిగి మైదానం వైపు రావడం ప్రారంభించింది. తర్వాత విరాట్ అనుష్క వైపు పరిగెత్తి మెట్లపై తన భార్యను కౌగిలించుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుంటూ మెట్లపై కొంతసేపు నిలబడ్డారు.
Also Read:
AICC: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. సినీ నటికి అవకాశం!
ఆ తర్వాత కోహ్లీ అనుష్క చేయి పట్టుకుని కిందికి తీసుకువచ్చాడు. ఇద్దరూ కలిసి టైటిల్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. విరుష్క ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కాగా విరాట్ ఫైనల్లో రానించలేదు.. కానీ పాకిస్తాన్ పై సెంచరీ, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అర్ధ సెంచరీ మర్చిపోలేనివి. ఫైనల్లో భారత్ 49 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
This moment!🏆❤️#AnushkaSharma hugged #ViratKohli after India's epic win in the #ICCChampionsTrophy2025 finals. #INDvsNZ pic.twitter.com/QmEDAJcziu
— Filmfare (@filmfare) March 9, 2025
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..