Champions Trophy: భారత్ గ్రాండ్ విక్టరీ.. అనుష్కకు కోహ్లీ విన్నింగ్ హగ్..
- ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ గ్రాండ్ విక్టరీ
- అనుష్కకు కోహ్లీ విన్నింగ్ హగ్
- ఇద్దరూ కలిసి టైటిల్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫైనల్ లో న్యూజీలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మూడోసారి గెలుచుకున్న జట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ రెండోసారి ICC ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంలో జట్టులోని ఆటగాళ్లు అందరు కీలక పాత్ర పోషించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్టంప్స్ తీసుకుని గ్రౌండ్ లో దాండియా నృత్యం చేశారు. విజయం తర్వాత కోహ్లీ తన భార్య అనుష్క శర్మ వద్దకు వెళ్లి ఆమెను కౌగిలించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.
Also Read:IND vs NZ: రోహిత్ ఖాతాలో మరో “హిట్టు”.. భారత్ ఘన విజయం..
Also Read
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
- New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
- Ben Stokes Returns: 'క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది'.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
- India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
హగ్ చేసుకున్న తర్వాత ఆటగాళ్లు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న మైదానానికి అనుష్కను తీసుకువచ్చాడు. టీమిండియా విజయం తర్వాత విరాట్, అనుష్క మధ్య ఒక ప్రేమకథ కనిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను చూసేందుకు అనుష్క శర్మ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి వచ్చింది. భారత్ గెలుపు తర్వాత విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గ్యాలరీ నుంచి దిగి మైదానం వైపు రావడం ప్రారంభించింది. తర్వాత విరాట్ అనుష్క వైపు పరిగెత్తి మెట్లపై తన భార్యను కౌగిలించుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుంటూ మెట్లపై కొంతసేపు నిలబడ్డారు.
Also Read:
AICC: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. సినీ నటికి అవకాశం!
ఆ తర్వాత కోహ్లీ అనుష్క చేయి పట్టుకుని కిందికి తీసుకువచ్చాడు. ఇద్దరూ కలిసి టైటిల్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. విరుష్క ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కాగా విరాట్ ఫైనల్లో రానించలేదు.. కానీ పాకిస్తాన్ పై సెంచరీ, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అర్ధ సెంచరీ మర్చిపోలేనివి. ఫైనల్లో భారత్ 49 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
This moment!🏆❤️#AnushkaSharma hugged #ViratKohli after India's epic win in the #ICCChampionsTrophy2025 finals. #INDvsNZ pic.twitter.com/QmEDAJcziu
— Filmfare (@filmfare) March 9, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!