Champions Trophy: భారత్ గ్రాండ్ విక్టరీ.. అనుష్కకు కోహ్లీ విన్నింగ్ హగ్..
- ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ గ్రాండ్ విక్టరీ
- అనుష్కకు కోహ్లీ విన్నింగ్ హగ్
- ఇద్దరూ కలిసి టైటిల్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఫైనల్ లో న్యూజీలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మూడోసారి గెలుచుకున్న జట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ రెండోసారి ICC ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంలో జట్టులోని ఆటగాళ్లు అందరు కీలక పాత్ర పోషించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్టంప్స్ తీసుకుని గ్రౌండ్ లో దాండియా నృత్యం చేశారు. విజయం తర్వాత కోహ్లీ తన భార్య అనుష్క శర్మ వద్దకు వెళ్లి ఆమెను కౌగిలించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి.
Also Read:IND vs NZ: రోహిత్ ఖాతాలో మరో “హిట్టు”.. భారత్ ఘన విజయం..
Also Read
- ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
- Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
- Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకురండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
హగ్ చేసుకున్న తర్వాత ఆటగాళ్లు సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న మైదానానికి అనుష్కను తీసుకువచ్చాడు. టీమిండియా విజయం తర్వాత విరాట్, అనుష్క మధ్య ఒక ప్రేమకథ కనిపించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ను చూసేందుకు అనుష్క శర్మ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి వచ్చింది. భారత్ గెలుపు తర్వాత విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గ్యాలరీ నుంచి దిగి మైదానం వైపు రావడం ప్రారంభించింది. తర్వాత విరాట్ అనుష్క వైపు పరిగెత్తి మెట్లపై తన భార్యను కౌగిలించుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుంటూ మెట్లపై కొంతసేపు నిలబడ్డారు.
Also Read:
AICC: ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. సినీ నటికి అవకాశం!
ఆ తర్వాత కోహ్లీ అనుష్క చేయి పట్టుకుని కిందికి తీసుకువచ్చాడు. ఇద్దరూ కలిసి టైటిల్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. విరుష్క ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కాగా విరాట్ ఫైనల్లో రానించలేదు.. కానీ పాకిస్తాన్ పై సెంచరీ, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అర్ధ సెంచరీ మర్చిపోలేనివి. ఫైనల్లో భారత్ 49 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
This moment!🏆❤️#AnushkaSharma hugged #ViratKohli after India's epic win in the #ICCChampionsTrophy2025 finals. #INDvsNZ pic.twitter.com/QmEDAJcziu
— Filmfare (@filmfare) March 9, 2025
తాజావార్తలు
-
Janhvi Kapoor: ‘స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్ను బయటపెట్టిన బుచ్చిబాబు!
-
CM Chandrababu: గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష.. పవన్ కల్యాణ్ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం..
-
Mamata Banerjee Protest: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ధర్నాకు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే..
-
Pawan Kalyan : గద్దరన్న విగ్రహం ఏపీలో పెట్టిస్తా
-
Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. ‘పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!