పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.. మాజీ కెప్టెన్ బాబర్ ఆజంపై విమర్శలు గుప్పించాడు. బాబర్ ఆజంను 'మోసగాడు' అని అభివర్ణించాడు. అతను మోసగాడు ఎందుకో గల కారణాన్ని అక్తర్ వివరించాడు. బాబర్ ఆజంను పాకిస్తాన్ కింగ్ అని పిలుస్తారు.. కానీ ఆజం పెద్ద మ్యాచ్లలో జట్టు తరపున సరిగ్గా ఆడలేకపోతున్నాడు. ఈ క్రమంలో అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు.
గత కొంత కాలంగా ఫామ్తో తంటాలు పడుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లీ సరైన సమయంలో ఓ మేటి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు. 111 బంతుల్లో 7 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇది కోహ్లీకి 51 సెంచరీ. చాలా కాలం తర్వాత వన్డేల్లో సెంచరీ చేసిన కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా లభించింది. వన్డేల్లో ఇది…
ఫామ్ లేమితో ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్పై సూపర్ సెంచరీ (100 నాటౌట్: 111 బంతుల్లో 7 ఫోర్లు) చేశాడు. ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా.. ఆచితూచి ఆడి వన్డేల్లో 51వ సెంచరీని పూర్తి చేశాడు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్తో కలిసి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. విరాట్ శతకం బాదడంతో అభిమానులు జోష్లో ఉన్నారు. కింగ్…
36 ఏళ్ల వయసులో విశ్రాంతి చాలా అవసరమని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. విశ్రాంతి తీసుకుంటే మిగతా మ్యాచుల్లో రాణించడానికి దోహదం చేస్తుందన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ (100 నాటౌట్: 111 బంతుల్లో 7 ఫోర్లు) సెంచరీ బాదాడు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇక మార్చి 2న న్యూజిలాండ్తో భారత్ మ్యాచ్ ఆడనుంది.…
భారత్- పాక్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 45 బంతులు ఉండగానే పూర్తి చేసింది. ఈ మ్యాచ్లో ఫోర్ కొట్టి టీమిండియాకు మర్చిపోలేని విక్టరీని అందించాడు విరాట్ కోహ్లీ. ఈ లెజెండరీ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ క్రీజులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి పాక్ బౌలర్లను చీల్చి చెండాడాడు.
వరుస ఓటములతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ తప్పుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య దేశం వరుస ఓటములతో ఈ పోటీ నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్ గెలిచిన ఇండియా సెమీఫైనల్ చేరింది. ఓడిన పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔటైంది. చివరిసారి 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ రెండు టీమ్సే తలపడ్డాయి. అందులో ఇండియాను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఓ ఐసీసీ టోర్నీలో ఇండియాను పాక్ ఓడించడం అదే తొలిసారి. ఇప్పుడు…
భారత్ పాకిస్థాన్పై ఘన విజయం సాధించింది. 2 వికెట్ల నష్టానికి వద్ద పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో విరాట్, శ్రేయస్ అయ్యారు ఇద్దరూ నిలకడగా ఆడటం కలిసొచ్చింది. విరాట్ సెంచరీ పూర్తి చేశాడు. శ్రేయస్ ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ను భారత్ 241 పరుగులకు ఆలౌట్ చేసింది.
విరాట్ కోహ్లీకి పాకిస్తాన్పై ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. మొదట ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ అత్యధిక క్యాచ్ల రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాటింగ్లో మరో రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో కోహ్లీ 14,000 పరుగులు పూర్తి చేశాడు.
నేడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు పాకిస్థాన్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సరికి పాకిస్థాన్ 241 పరుగుల వద్ద కుప్పకూలింది. హర్షిత్ రాణా వేసిన 49.4 ఓవర్కు ఖుష్దిల్ షా (38) ఔటయ్యాడు. దీంతో పాక్ 241 పరుగులకు ఆలౌటైంది.