అమరావతి : నేడు విజయవాడ కు రానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విమానంలో విజయవాడ కు చేరుకోనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రేపు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే… పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు జనసేనాని. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రదేశ్…
విజయవాడ ఏ.ఆర్ కానిస్టేబుల్ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఐస్క్రీమ్ బండి యజమానిని హతమార్చాడు. ఐస్క్రీమ్ బండి యజమాని వెంకటేష్ ….తన ఇంట్లోకి చొరబడినట్లు సమాచారం అందుకున్న కానిస్టేబుల్ డ్యూటీలో నుంచి వెంటనే ఇంటికి చేరుకున్నాడు. వెంకటేష్ని పట్టుకుని తీవ్రంగా గాయపరిచారు ఏఆర్ కానిస్టేబుల్. ఈ దాడిలో వెంకటేష్కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు వెంకటేష్. దాంతో అతని…
సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ సరిపోక చాలా ఇబ్బంది పడ్డామని, మరణాల సంఖ్య కూడా ఎక్కువ ఉండటం బాధేసింది విజయవాడ వీజీహెచ్ సూపరిండెంట్ తెలిపారు. ఇక థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగానే సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పుడు 1000 లీటర్ల కెపాసిటీ కల్గిన మూడు కంటైనర్లు ఏర్పాటు చేసాం.. ప్రతి బెడ్ కు ఆక్సిజన్ అందుబాటులో ఉంచాము. ఆక్సిజన్ పైపుల వెడల్పు పెంచి ఒకేసారి ఎక్కువ మందికి ఆక్సిజన్ అందేలా ఏర్పాటు చేసామన్నారు. వెంటిలేటర్స్ దగ్గర నుండి…
విపక్షంలో ఉన్న పార్టీ పుంజుకోవాలంటే నేతలంతా కలిసి కట్టుగా పనిచేయాలి.. కానీ, బెజవాడ టిడిపిలో ఇది రివర్స్ లో ఉందట.. అసెంబ్లీ ఎన్నికల టైంలోనే మొదలైన కలహాలు ఇంకా కొనసాగుతున్నాయట.. ఎవరి దారి వారిదే అన్నట్టు సాగుతున్నారట. నేతల మధ్య పోరుతో కేడర్ అయోమయంలో పడుతోందట.. బెజవాడ టిడిపిలో కలహాల కాపురం సాగుతోంది. నేతల మధ్య లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో మొదలైన కలహాలు కార్పొరేషన్ ఎన్నికల నాటికి రచ్చకెక్కాయి. గతంలో అధికారంలో ఉన్న…
బెజవాడలో నేటి నుండి ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కాయి. కరోనా కారణంగా రద్దయిన రైళ్లు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. కానీ ఈ ప్యాసింజర్ రైళ్లలో ఎక్స్ ప్రెస్ చార్జీల మోత మోగుతుంది. ఇకపై 30 నుండి 200 శాతం అదనంగా టికెట్ ధర వసూలు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చారు. అయితే పెరిగిన ఈ టికెట్ ధరలతో వలస కార్మికులకు, మధ్యతరగతి ప్రజలపై మొయ్యలేని భారం పడుతుంది. ఇక పెరుగుతున్న…
పెట్రో ధరలు వరుసగా పెరిగిపోతూనే ఉన్నాయి… పెట్రో భారం ప్రత్యక్ష, పరోక్షంగా ప్రజల నడ్డి విరిస్తూనే ఉంది.. రోజువారీ సమీక్షలో భాగంగా ఇవాళ దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 30 పైసలు పెంచేశాయి.. దీంతో.. ఢిల్లీలో లీటర్ ప్రెటోల్ ధర రూ.101.84కి చేరగా.. డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధానిలో లీటర్ డీజిల్ ధర రూ.89.87గా ఉంది.. 75 రోజుల్లో 41వ సారి పెట్రో ధరలను వడ్డించాయి చమురు సంస్థలు.. ఢిల్లీ, ముంబై, చెన్నై,…
నేడు విజయవాడ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అయితే రేపు మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు జనసేనాని. ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై చర్చించనున్న పవన్.. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానంగా చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య జల…
తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గానికి జరగిన ఉప ఎన్నిక తరువాత జనసేన పార్టీ సైలెంట్ అయింది. కరోనా నిబంధనలు ఎత్తివేస్తుండటంతో పార్టీ పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై నేతలతో చర్చించేందుకు జనసేనాని సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా జులై 6 వ తేదీన విజయవాడలో పర్యటించబోతున్నారు. విజయవాడలో ఆయన పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలు, ఇటీవలే ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్, రాష్ట్రంలో ప్రజలు…
భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు బంగ్లాదేశ్కు చెందిన యువకులను అరెస్ట్ చేవారు బెజవాడ పోలీసులు.. పోలీసుల విచారణలో తుల్లానా జిల్లా నుండి భారత్లోకి ప్రవేశించినట్టుగా తెలిపారు.. ఆ తర్వాత హావ్ డా – వాస్కోడిగామా రైలులో వెళ్తుండగా బెజవాడలో అదుపులోకి తీసుకున్నారు రైల్వే పోలీసులు.. పాస్ పోర్ట్ లేకుండా నల్లాల ద్వారా భారత్లోకి అక్రమంగా ప్రవేశించినట్టు గుర్తించారు.. దర్బంగా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. అసలు ఆ యువకులు ఏపీలోకి రావడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు..…
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు.. ఇవాళ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరగగా.. విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఆమోదం తెలిపింది కోర్టు.. ఎస్బీఐ వేలంలో 1401 చదరపు గజాల భూమిని రూ.22.45 కోట్లకు విజన్ ఎస్టేట్స్ దక్కించుకోగా.. అగ్రిగోల్డ్ కు విజన్ ఎస్టేట్స్ బినామీ కాదని హైకోర్టుకు తెలిపింది ఏపీ సీఐడీ.. వాస్తవ మార్కెట్ ధరకన్నా విజన్ ఎస్టేట్ తక్కువకు కోట్ చేసిందని పేర్కొంది సీఐడీ.. అయితే, వాస్తవ ధర…