పసిడి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. తాజాగా బుధవారం బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,100 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.48,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 73,000 గా వుంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,100 ఉండగా.. 24…
కోవిడ్ విజృంభణతో చాలా రాష్ట్రాలు టెన్త్ పరీక్షలు రద్దు చేశాయి.. పరీక్షల ఫీజులు చెల్లించిన అందరు విద్యార్థులు పాస్ అయినట్టు ప్రకటించాయి.. వాళ్లకు ఇరత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కూడా కేటాయించారు. అయితే, ఏపీ మాత్రం.. పరీక్షలు వాయిదా వేసింది.. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది.. ఇక, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని.. జులై 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పదవ తరగతి…
కరోనా సమయంలో ఆర్టీసీ బస్సులు మునుపడిలా తిరిగే పరిస్థితి లేదు.. చాలా బస్సులు డిపోలకే పరిమితమైన పరిస్థితి.. ఈ సమయంలో.. ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టింది ఏపీఎస్ ఆర్టీసీ… దీంట్లో భాగంగా.. పల్లెవెలుగు బస్సులకి కొత్త రూపు ఇస్తున్నారు.. కార్గో ఆదాయంపై ఫోకస్ పెట్టిన ఏపీఎస్ ఆర్టీసీ.. కాలం చెల్లిన పల్లె వెలుగు బస్సులను కార్గో క్యారియర్లుగా మార్చేస్తోంది… ఇప్పటికే 80 బస్సుల్లో 30 బస్సులను కార్గో క్వారియర్లుగా తయారు చేసింది ఆర్టీసీ.. నెల్లూరుకు 10 బస్సులను…
విజయవాడ దుర్గగుడి లో నకిలీ సర్టిఫికెట్లు కలకలం రేపుతున్నాయి. దుర్గగుడి లో పనిచేస్తున్న ఇద్దరు ఆలయ ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్ల తో పదోన్నతి పొందారు. తాజాగా అధికారుల విచారణలో నకిలీ సర్టిఫికెట్లు బాగోతం బయటపడింది. దుర్గగుడిలో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తున్న రాజు జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణులు నకిలీ సర్టిఫికెట్ల తో పదోన్నతి పొందినట్లు గుర్తించి వారిని సస్పెండ్ చేసారీ ఆలయ ఈఓ. సస్పెండ్ చేసిన ఆ ఇద్దరు పైన కేసు నమోదు చేసే అవకాశం…
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గనేలేదు.. థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. దీంతో.. థర్డ్ వేవ్ వస్తే ఎలా..? చిన్నారులు ఎక్కువ మంది కోవిడ్ బారినపడితే ఏం చేద్దాం అనే దానిపై ఫోకస్ పెట్టాయి ప్రభుత్వాలు.. ఇక, ఏపీ ప్రభుత్వం చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రినే నిర్మించాలని నిర్ణయానికి వచ్చింది.. ఏపీలో 20 ఏళ్ల లోపు 11.07 శాతం మంది ఉన్నారని తెలిపిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. మూడో…
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని కాంట్రాక్టు నర్సుల ఆందోళన చేస్తున్నారు. ప్లే కార్డులతో కోవిడ్ పేషేంట్స్ కు ఇబ్బంది లేకుండా, విధులు నిర్వహిస్తూనే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచాలని,కాంట్రాట్ ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ డ్యూటీ చేస్తూ కోవిడ్ వచ్చి 15 రోజులు సెలవలు పెడితే జీతం కట్ చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన విరమించేది లేదంటున్నారు నర్సులు.…
ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకులకు బురిడీ కొట్టిసున్న మాయ లేడీ శ్రీదివ్యపై పోలీస్ కేసు నమోదు అయింది.. ఆమెతో పాటు తమ్ముడు పోతురాజు, ఆమెకు సహకరిస్తున్న రజాక్ లపై బాధితుడు విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి చేసుకుంటాను అంటూ ఆ యువకుడి నుంచి 80 లక్షలు కొట్టేసింది. డబ్బులు వసూలు చేశాక ఆ మహిళ ముఖం చాటేస్తోంది. కాగా మాయలేడీ మోసాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె చేతిలో ఇలానే మోసపోయిన పలువురి వద్ద…
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీ విమానా సర్వీసులు నిలిచిపోయాయి… ఏప్రిల్ 3వ తేదీ నుంచి తాత్కాలికంగా విదేశీ విమానాలను నిలిపివేశారు అధికారులు.. అయితే, ఇప్పుడు పరిస్థితి కాస్త చేతుల్లోకి రావడంతో.. తిరిగి విదేశీ సర్వీసులను ప్రారంభించారు.. దుబాయ్ నుంచి 65 మంది ప్రవాసాంధ్రులతో రాష్ట్రానికి చేరుకుంది ప్రత్యేక విమానం.. అయితే, ఇవి గతంలో మాదిరి రెగ్యులర్ సర్వీసులు కావు.. వందే భారత్ మిషన్లో భాగంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు.. దీంతో..…
నేటి నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశీ సర్వీసులు పునః ప్రారంభం అవుతున్నాయి. గల్ఫ్ లోని మస్కట్, కువైట్.. సింగపూర్ ఇతర దేశాల నుంచి తరలిరానున్నాయి సర్వీసులు. అయితే ఏప్రిల్ 3వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిచి పోయాయి విదేశీ సర్వీసులు. ఈరోజు సాయంత్రం 6.10 గంటలకు 65 మంది ప్రవాసాంధ్రులతో చేరుకోనున్నాయి దుబాయ్ సర్వీస్. వందే భారత్ మిషన్లో భాగంగా రానున్న విదేశీ సర్వీసులకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసారు. ఆదివారం మినహా ఇతర రోజుల్లో…