గుంటూరులో కలకలం రేపుతోంది. కలుషిత నీరు సరఫరా కావడంతో డయేరియా విజృంభిస్తోంది. గడచిన నాలుగురోజులుగా డయేరియాతో బాధపడుతున్న వారు ఆస్పత్రిలో చేరుతున్నారు. డయేరియాతో ఒకరు చనిపోగా.. మరో 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే డయేరియా ప్రబలడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. గుంటూరులో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు, అనారోగ్యం బారిన పడ్డారని.. అనారోగ్యానికి గురైన వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.…
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారు. నిందితులను వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. మంత్రి కార్యాలయంపై దాడి చేసిన వారు టీడీపీ-జనసేన కార్యకర్తలు అని పోలీసులు తెలిపారు.
Minister Vidadala Rajini Fires on TDP: ప్రశాంతంగా ఉన్న గుంటూరు పశ్చిమలో కావాలనే అలజడి సృష్టిస్తున్నారని మంత్రి విడదల రజిని అన్నారు. టీడీపీ శ్రేణులు భయపెడితే.. భయపడే రకం తాను కాదన్నారు. తమ సొంత భవనంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే.. టీడీపీ శ్రేణులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అని ప్రశ్నించారు. వైసీపీ కుటుంభం అప్రమత్తంగా ఉండాలని, రెచ్చగొట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన…
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని కార్యాలయంపై జరిగిన దాడిని ఎమ్మెల్యే మద్దాలి గిరి ఖండించారు. దాడికి పాల్పడిన టీడీపీ రౌడీ మూకల్ని ప్రజలు అస్సలు క్షమించరన్నారు. బీసీ మహిళ గుంటూరులో పోటీ చేయకూడదా? అని మద్దాలి గిరి ప్రశ్నించారు. ప్రతి ఎన్నిక సందర్భంలో ఏదో ఒక దాడి చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని ఎమ్మెల్యే మద్దాలి గిరి విమర్శించారు. ఎమ్మెల్యే మద్దాలి గిరి మీడియాతో మాట్లాడుతూ… ‘టీడీపీ రౌడీ మూకల్ని ప్రజలు…
AP Minister Vidadala Rajini React on Attck on Guntur Party Office: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తన కార్యాలయంపై జరిగిన దాడిని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఖండించారు. టీడీపీ గుండాలే ఈ దాడి చేశారని, దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇది పక్కా ప్లాన్తో జరిగిన దాడని, రాళ్లు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారన్నారు. బీసీ మహిళనైన తనపై కుట్రలు చేస్తున్నారని, ఇలాంటి దాడులతో ఏమాత్రం భయపెట్టలేరని మంత్రి…
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుంటూరులో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విద్యానగర్లోని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని నూతన పార్టీ ఆఫీస్పై టీడీపీ-జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి.. గుంపును చెదరగొట్టారు. కొంతమంది టీడీపీ-జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మంత్రి విడుదల రజిని కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఉంది. ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా…
జాతీయ వైద్య మండలి కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని, వాటిని సడలించి పాత పద్ధతి కొనసాగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కలిసి విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్లో అవకతవకలు జరిగాయని ఈడీ పేర్కొందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందని అన్నారు.
గుంటూరు జిల్లా వెంకటపాలెంలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు జోగి రమేష్, విడదల రజని. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. పేదల ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతుండటం ఒక చరిత్ర అని ఆయన కొనియాడారు. పేదలకు ఇళ్లు కట్టకూడదని పెత్తందార్లు ఒకవైపు... పేదలకు ఇళ్లు కట్టిచూపిస్తానని పేదల పక్షాన సీఎం జగన్ అని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్ పేదల ఇళ్లకు అడ్డుపడ్డారని, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులకు చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.…