Minister Vidadala Rajini: ఎన్ఎంసీ కొత్త నిబంధనలు సడలించండి.. కేంద్రమంత్రికి విడదల రజినీ వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ వైద్య మండలి కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని, వాటిని సడలించి పాత పద్ధతి కొనసాగించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కలిసి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రిని ఇవాళ (బుధవారం) మంత్రి విడదల రజిని కలిసి ఈమేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ఎన్ఎంసీ కొత్తగా పలు నిబంధనలు తీసుకొచ్చిందని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో ప్రతి పది లక్షల మంది జనాభాకు వంద సీట్లు చొప్పున మాత్రమే అనుమతి ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చిందని ఆమె తెలిపారు.
Read Also: Chiyaan Vikram: ఆ డైరెక్టర్ తో విక్రమ్ కొత్త సినిమా..?
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
అయితే, కొత్త మెడికల్ కళాశాలలకు అనుమతి ఇవ్వాలంటే 605 పడకల సామర్ధ్యంతో ఆసుపత్రి కూడా ఉండాలని ఎన్ఎంసీ తాజాగా నిర్ణయించిందని మంత్రి విడదల రజినీ చెప్పారు. ఈ రెండు నిబంధనల వల్ల కొత్తగా ఏర్పడిన తమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్లో టెర్షియరి కేర్ సర్వీసెస్ విషయంలో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. దీనివల్ల ఏకంగా రూ. 8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కళాశాలలను సీఎం జగన్ నిర్మిస్తున్నారని వివరించారు. వీటిలో ఇప్పటికే 5 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. మిగిలిన 12 కళాశాలల పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆమె తెలిపారు.
Read Also: Akkineni Nagarjuna : అక్కినేని నాగార్జున ఇంట తీవ్ర విషాదం.. సోదరి కన్నుమూత..
వచ్చే ఏడాది 5 కొత్త కళాశాలలు ప్రారంభం కాబోతున్నాయని, అందుకు సంబంధించి సిబ్బంది నియామకాలు కూడా పూర్తయ్యాయని మంత్రి విడదల రజినీ వివరించారు. కొత్త నిబంధనల వల్ల తమ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా కొత్తగా మంజూరయ్యే అవకామే ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య రంగంలో సీఎం జగన్ తీసుకొస్తున్న గొప్ప సంస్కరణలకు మీ వంతు సహకారం ఉండాలని, ఏపీకి ఆధునిక వైద్యం అందే విషయంలో ఎలాంటి నష్టం రాకుండా చొరవ తీసుకోవాలని కేంద్ర వైద్యఆరోగ్యమంత్రికి విడదల రజినీ వినతి పత్రం అందించారు. మంత్రి వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!