Botsa Satyanarayana: చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్లో అవకతవకలు జరిగాయని ఈడీ పేర్కొందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందని అన్నారు. అవినీతి చేశారు కాబట్టే అరెస్ట్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు తప్పు చేయకపోతే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. దర్యాప్తు సంస్థలు పూర్తిగా దర్యాప్తు చేసిన తరువాత మాత్రమే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని.. అన్ని న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తరువాత మాత్రమే చంద్రబాబును అరెస్ట్ చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Sreenu Vaitla: శ్రీను వైట్ల అజ్ఞాత వాసానికి తెర.. సినిమా మొదలెట్టేశాడు!
Also Read
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
- Google Mapsలో సూపర్ అప్డేట్.. హోటల్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ వరకు అన్నీ ఒకేచోట
మరోవైపు మంత్రి విడుదల రజని మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ తప్పనిసరి పరిణామమన్నారు. చంద్రబాబు లా పరిధి దాటి ఉన్న వ్యక్తిలా అనుకుంటున్నారని.. ప్రభుత్వ ధనాన్ని దుర్మార్గంగా దోచుకున్నారని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఇది తొలి అరెస్ట్ కాదని.., ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయ్యారని మంత్రి తెలిపారు. ఈ స్కాంలో అనేక మంది పాత్ర ఉందన్నారు. క్యాబినెట్ నిర్ణయానికి, అగ్రిమెంట్ కి, చెల్లింపులుకి పొంతన లేవని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ సొమ్ము దారుణంగా దోచుకున్నారని మంత్రి విడుదల రజని విమర్శించారు.
Read Also: Minister KTR: డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్గా కూడా నిర్మాణాలు జరగాలి
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ ముసుగులో బాబు భారీ స్కాం చేశారని ఆరోపించారు. సీమెన్స్ తో రూ. 3356 కోట్లతో అప్పట్లో ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో సిమెన్స్ 90% ప్రభుత్వం 10% పెట్టుబడి పెట్టాలని ఒప్పందం ఉందని.. కానీ ఆ కంపెనీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వం రూ. 371 కోట్ల నిధులు విడుదల చేసిందని.. ఆ డబ్బు షెల్ కంపెనీల ద్వారా బాబు అండ్ కో జేబుల్లోకి వెళ్లాయని మంత్రి వేణుగోపాల కృష్ణ ఆరోపించారు.
తాజావార్తలు
-
Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
-
AP FDC : ఏపీలో షూటింగ్లకు గుడ్న్యూస్.. ఇక ఫాస్ట్ ట్రాక్ పర్మిషన్లు.!
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
-
Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
-
Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!