Botsa Satyanarayana: చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్లో అవకతవకలు జరిగాయని ఈడీ పేర్కొందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందని అన్నారు. అవినీతి చేశారు కాబట్టే అరెస్ట్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు తప్పు చేయకపోతే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. దర్యాప్తు సంస్థలు పూర్తిగా దర్యాప్తు చేసిన తరువాత మాత్రమే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని.. అన్ని న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తరువాత మాత్రమే చంద్రబాబును అరెస్ట్ చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Sreenu Vaitla: శ్రీను వైట్ల అజ్ఞాత వాసానికి తెర.. సినిమా మొదలెట్టేశాడు!
Also Read
- 2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
- Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
మరోవైపు మంత్రి విడుదల రజని మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ తప్పనిసరి పరిణామమన్నారు. చంద్రబాబు లా పరిధి దాటి ఉన్న వ్యక్తిలా అనుకుంటున్నారని.. ప్రభుత్వ ధనాన్ని దుర్మార్గంగా దోచుకున్నారని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఇది తొలి అరెస్ట్ కాదని.., ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయ్యారని మంత్రి తెలిపారు. ఈ స్కాంలో అనేక మంది పాత్ర ఉందన్నారు. క్యాబినెట్ నిర్ణయానికి, అగ్రిమెంట్ కి, చెల్లింపులుకి పొంతన లేవని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ సొమ్ము దారుణంగా దోచుకున్నారని మంత్రి విడుదల రజని విమర్శించారు.
Read Also: Minister KTR: డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్గా కూడా నిర్మాణాలు జరగాలి
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ ముసుగులో బాబు భారీ స్కాం చేశారని ఆరోపించారు. సీమెన్స్ తో రూ. 3356 కోట్లతో అప్పట్లో ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో సిమెన్స్ 90% ప్రభుత్వం 10% పెట్టుబడి పెట్టాలని ఒప్పందం ఉందని.. కానీ ఆ కంపెనీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వం రూ. 371 కోట్ల నిధులు విడుదల చేసిందని.. ఆ డబ్బు షెల్ కంపెనీల ద్వారా బాబు అండ్ కో జేబుల్లోకి వెళ్లాయని మంత్రి వేణుగోపాల కృష్ణ ఆరోపించారు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!