Vidadala Rajini: గుంటూరులో డయేరియా కలకలం.. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరులో కలకలం రేపుతోంది. కలుషిత నీరు సరఫరా కావడంతో డయేరియా విజృంభిస్తోంది. గడచిన నాలుగురోజులుగా డయేరియాతో బాధపడుతున్న వారు ఆస్పత్రిలో చేరుతున్నారు. డయేరియాతో ఒకరు చనిపోగా.. మరో 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే డయేరియా ప్రబలడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. గుంటూరులో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు, అనారోగ్యం బారిన పడ్డారని.. అనారోగ్యానికి గురైన వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. జరిగిన ఘటనపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తున్నామని అన్నారు.
Read Also: Ka Paul: దమ్ముంటే చంద్రబాబు, మోడీ, జగన్ నాపై పోటీ చేయాలి..
Also Read
గుంటూరు హాస్పిటల్లో మంచి వైద్యం అందుతుందని మంత్రి రజిని తెలిపారు. ప్రజలకు అనారోగ్యం పై కారణాల పై దర్యాప్తు చేస్తున్నామన్నారు. నీరు, ఆహారంకు సంబంధించిన 32 శ్యాంపిల్స్ ను సేకరించారన్నారు. కలెక్టర్, కమిషనర్ నేతృత్వంలో ఘటన పై దర్యాప్తు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. 2018లో గుంటూరులో డయేరియా ప్రబలి తీవ్ర స్థాయిలో ప్రజలు మృత్యువాత పడ్డారని తెలిపారు. ఆ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి అన్నారు. డయేరియా ప్రభలడం అంటే అది అని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం.. ఈ ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని మంత్రి చెప్పారు. డయేరియా కోసం హెల్ప్ డెస్క్ నంబర్ కూడా ఏర్పాటు చేశాం.. ప్రజలు అనారోగ్యం బారిన పడితే వెంటనే అధికారులను సంప్రదించవచ్చని మంత్రి విడదల రజిని తెలిపారు.
Read Also: Rajasthan: అంగన్వాడీ ఉద్యోగాల సాకుతో 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారం..
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!