S Jaishankar: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయితే, భారత్ మాత్రం రష్యా నుంచి ముడి చమురు కొంటూనే ఉంది. పలు సందర్భాల్లో యూరప్, అమెరికా నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ భారత్ ముడిచమురు కొనడం ఆపలేదు. పలు సందర్భాల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెస్ట్రన్ మీడియాకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. తాజాగా ఆయన మరోసారి అమెరికా ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఔరా అనిపించారు.
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. న్యూయార్క్ కోర్టు జడ్జి ఆర్థర్ అంగోరాన్ ట్రంప్, అతని కంపెనీలను మోసం చేసిన కేసులో సుమారు 355 మిలియన్ డాలర్లు అంటే రూ. 3వేల కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించారు.
Bubonic Plague: 14వ శతాబ్ధంలో ప్రపంచాన్ని భయపెట్టిన, దాదాపుగా ఐరోపాలో 10 లక్షల మంది ప్రాణాలను తీసుకున్న ‘‘బుబోనిక్ ప్లేగు’’ అమెరికాలో గుర్తించారు. యూఎస్ ఓరేగాన్లో ఓ వ్యక్తిలో ఈ వ్యాధిని గుర్తించారు. డెస్చుట్స్ కౌంటీలో రోగికి పెంపుడు పిల్లి ద్వారా ఈ వ్యాధి సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పిల్లికి, రోగికి మధ్య కాంటాక్ట్ ఉన్నట్లు గుర్తించామని, అనారోగ్యాన్ని నివారించడానికి మెడికేషన్ ఇచ్చామని ఆ ప్రాంత ఆరోగ్య అధికారి డాక్టర్ రిచర్డ్ ఫాసెట్ ఒక ప్రకటనలో చెప్పారు.
California: అమెరికా కాలిఫోర్నియాలో దారుణం చోటు చేసుకుంది. భారతీయ దంపతులు, తమ ఇద్దరు పిల్లలతో కలిసి మరణించారు. 2 మిలియన్ డాలర్ల విలువైన ఇంటిలో విగతజీవులుగా కనిపించారు. మరణించిన వ్యక్తుల్ని ఆనంద్ సుజిత్ హెన్రీ, 42, అతని భార్య అలిస్ ప్రియాంక, 40, మరియు వారి 4 సంవత్సరాల కవల పిల్లలు నోహ్ మరియు నీతాన్లుగా గుర్తించారు. ఈ ఘటనను హత్య-ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన వ్యక్తులపై తుపాకీ గాయాలు కనిపించాయి.
Tom Moody React on USA Pitches: టీ20 ప్రపంచకప్ 2024 ఉన్న నేపథ్యంలో ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ప్రదర్శనలకు ఎంతో ప్రాధాన్యం ఉండబోతుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ అంటున్నారు. ఐపీఎల్ 2024లో పరుగులు చేయడం, వికెట్లు తీయడం టీ20 ప్రపంచకప్ సెలక్షన్లో పరిగణనలోకి రానున్నాయన్నారు. టీ20 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వనున్న అమెరికాలో ఆడడం చాలా మంది ఆటగాళ్లకు కొత్త అనుభవం కానుందని పేర్కొన్నారు. ఐపీఎల్ 2024 మర్చి 23న ఆరంభం…
Nikki Haley: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఇండో-అమెరికన్ నేత నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం అమెరికాతో భాగస్వామిగా ఉండాలని అనుకుంటోందని అయితే, ప్రస్తుతం అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని భారత్ విశ్వసించడం లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం భారత్ అమెరికాను బలహీనంగా చూస్తోందని, ప్రస్తుతం ప్రపంచ పరిస్థితుల్లో భారత్ తెలివిగా ఆట ఆడుతోందని, రష్యాతో సన్నిహితంగా ఉంటోందని ఆమె అన్నారు.
Indian Student: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మరణించాడు. ఈ ఏడాది ఇది 5వ ఘటన. వరసగా జరుగుతున్న ఈ సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా భారతీయ సంతతికి చెందిన విద్యార్థి సమీర్ కామత్ సోమవారం శవమై కనిపించాడు. సమీర్ కామత్ ఇండియానా పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్నారు. యూఎస్ సిటిజన్షిప్ ఉన్న కామత్ మరణంపై విచారణ జరుగుతోంది.
USA: అమెరికాలో భారత విద్యార్థిపై దుండగులు దాడి చేరారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఈ ఘటన చికాగోలో జరిగింది. హైదరాబాద్కి చెందిన విద్యార్థి తన ఇంటి సమీపంలో నలుగురు సాయుధ దొంగల దాడికి గురయ్యాడు. తీవ్రంగా కొట్టి, అతని సెల్ఫోన్ లాక్కెళ్లారు. ఈ ఏడాది అమెరికాలో నలుగురు భారతీయ విద్యార్థులు మరణించిన నేపథ్యంలో ఈ దాడి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది.
Candida Auris: అగ్రరాజ్యం అమెరికాను ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ భయపెడుతోంది. క్యాండిడా ఆరిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ అక్కడ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే వాషింగ్టన్ రాష్ట్రంలో ఈ నెలలో నలుగురు వ్యక్తులకు ఈ ఫంగస్ సోకింది. అత్యంత అరుదైన, ప్రాణాంతక ఇన్ఫెక్షన్ అని, దీని వల్ల అధిక మరణాల రేటు కలిగి ఉండటంతో పాటు డ్రగ్ రెసిస్టెంట్ కలిగి ఉండీ, సులభంగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Pakistan: మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు, 2011లో అతడిని చంపడానికి ముందే అమెరికా తనకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 2011లో అమెరికన్ కమాండోలు పాకిస్తాన్లో అబోట్టాబాద్లో బిన్ లాడెన్ని చంపేశారు. తాజాగా జియో న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.