Pakistan: బిన్ లాడెన్ పాక్లో ఉన్నాడని అమెరికా ముందే చెప్పింది.. మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు, 2011లో అతడిని చంపడానికి ముందే అమెరికా తనకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 2011లో అమెరికన్ కమాండోలు పాకిస్తాన్లో అబోట్టాబాద్లో బిన్ లాడెన్ని చంపేశారు. తాజాగా జియో న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Read Also: Bandi Sanjay: టాయిలెట్స్ నుండి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు ఇచ్చింది కేంద్రమే
Also Read
- Explained: యుద్ధంలో ట్రంప్ ఘోర పరాజయం.. ప్రపంచం ముందు నవ్వులపాలైన అమెరికా!
- Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
- Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
- India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
‘‘కండోలిజా రైస్( మాజీ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్) పాకిస్తాన్లో పర్యటిస్తున్న సమయంలో, ఆమె తనకు బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఉన్నట్లు భయపడింది’’ అని గిలానీ చెప్పాడు. 2008 నుండి 2012 వరకు గిలానీ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పని చేయగా, రైస్ అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఉంది, ఆ సమయంలో ఆమె నాలుగుసార్లు పాకిస్తాన్లో పర్యటించారు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత రైస్ ఇస్లామాబాద్లో ఆకస్మికంగా పర్యటించిన సమయంలో ఆమె తనను కలిసినట్లు గిలానీ చెప్పారు. లాడెన్ పాక్లో ఉన్నట్లు తనకు చెప్పితే, అది తప్పుడు సమాచారంగా కొట్టిపారేసినట్లు ఆయన వెల్లడించారు.
అయితే, పాకిస్తాన్ అబోటాబాద్లో మే 2, 2011లో అమెరికా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ నిర్వహించి బిన్ లాడెన్ని హతమార్చింది. ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అనే కోడ్-పేరుతో ఈ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్నారు. నేవీ సీల్స్, అమెరికా సీఐఏ ఈ ఆపరేషన్ని పకడ్బందీగా నిర్వహించింది. కనీసం పాక్ ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలియదు. ఆప్ఘనిస్తాన్ లోని అమెరికా నుంచి బ్లాక్ హాక్ హెలికాప్టర్లు అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ.. పాక్ రాడార్లకు చిక్కకుండా ఒసాబా బిన్ లాడెన్ ఉన్న బిల్డింగ్ వద్ద ల్యాండ్ అయి, కొన్ని నిమిషాల్లోనే ఆపరేషన్ ముగించాయి.
తాజావార్తలు
-
Sing Geetham : బాలకృష్ణ, కమల్ హాసన్ వేరు.. గుట్టు విప్పిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం!
-
Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
-
Sing Geetham :ఇంట్లో కూర్చునే 94 ఏళ్ల వయసులో డైరెక్షన్.. అద్భుత టెక్నాలజీని బయటపెట్టిన సింగీతం!
-
UP: సమాజ్వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
-
Pawan Kalyan: “ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!”.. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!