Pakistan: బిన్ లాడెన్ పాక్లో ఉన్నాడని అమెరికా ముందే చెప్పింది.. మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్ఖైదా అగ్రనేత ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు, 2011లో అతడిని చంపడానికి ముందే అమెరికా తనకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 2011లో అమెరికన్ కమాండోలు పాకిస్తాన్లో అబోట్టాబాద్లో బిన్ లాడెన్ని చంపేశారు. తాజాగా జియో న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Read Also: Bandi Sanjay: టాయిలెట్స్ నుండి స్ట్రీట్ లైట్స్ వరకు నిధులు ఇచ్చింది కేంద్రమే
Also Read
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
‘‘కండోలిజా రైస్( మాజీ యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్) పాకిస్తాన్లో పర్యటిస్తున్న సమయంలో, ఆమె తనకు బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఉన్నట్లు భయపడింది’’ అని గిలానీ చెప్పాడు. 2008 నుండి 2012 వరకు గిలానీ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పని చేయగా, రైస్ అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఉంది, ఆ సమయంలో ఆమె నాలుగుసార్లు పాకిస్తాన్లో పర్యటించారు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత రైస్ ఇస్లామాబాద్లో ఆకస్మికంగా పర్యటించిన సమయంలో ఆమె తనను కలిసినట్లు గిలానీ చెప్పారు. లాడెన్ పాక్లో ఉన్నట్లు తనకు చెప్పితే, అది తప్పుడు సమాచారంగా కొట్టిపారేసినట్లు ఆయన వెల్లడించారు.
అయితే, పాకిస్తాన్ అబోటాబాద్లో మే 2, 2011లో అమెరికా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ నిర్వహించి బిన్ లాడెన్ని హతమార్చింది. ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అనే కోడ్-పేరుతో ఈ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్నారు. నేవీ సీల్స్, అమెరికా సీఐఏ ఈ ఆపరేషన్ని పకడ్బందీగా నిర్వహించింది. కనీసం పాక్ ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలియదు. ఆప్ఘనిస్తాన్ లోని అమెరికా నుంచి బ్లాక్ హాక్ హెలికాప్టర్లు అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ.. పాక్ రాడార్లకు చిక్కకుండా ఒసాబా బిన్ లాడెన్ ఉన్న బిల్డింగ్ వద్ద ల్యాండ్ అయి, కొన్ని నిమిషాల్లోనే ఆపరేషన్ ముగించాయి.
తాజావార్తలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!