ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో.. శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు దంపతులు.
కలియుగ వైకుంఠమైన తిరుమల బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ జరుగుతుంది. విశేష పర్వదినాలుగా పిలిచే ఈ నెలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిన్న మహాలయ అమావాస్యకాగా.. ఇవాళ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు. రేపు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
శ్రీవారిని దర్శించుకున్న సమయంలో వారాహి డిక్లరేషన్ బుక్ను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారట పవన్ కల్యాణ్.. స్వామివారి దర్శనం.. దీక్ష విరమణ తర్వాత వారాహి డిక్లరేషన్ బుక్ను ఆలయం వెలుపల మీడియాకు చూపించారు పవన్.. దీంతో.. వారాహి డిక్లరేషన్ బుక్లో ఏముందు? అనే చర్చ సాగుతోంది..
తిరుమలలో స్వచ్ఛమైన లడ్డు తయారు చేసి భక్తులకు అందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు.. ఇందుకు నేను స్పష్టంగా హామీ ఇస్తున్నానని అన్నారు. తిరుమల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధోరణి హేయమైందని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల లడ్డూ వివాదం కారణంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నియమ నిష్ఠలతో స్వామి వారి నామం స్మరిస్తూ భక్తి మార్గంలో నడుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం బెజవాడ కనకదుర్గ అమ్మవారి గుడి మెట్లు శుభ్రం చేసి స్వయంగా మెట్ల పూజ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ప్రాయశ్చిత్త దీక్ష విరమణలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి మెట్ల మార్గం…
కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు దగ్గర నుంచి సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పలు వివరాలను సేకరించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలకు వెళతాం అని ఆయన తెలిపారు. కల్తీ నెయ్యి కేసులో ప్రతి అంశాన్ని విచారిస్తున్నాం.. విచారణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ చేశాం.
Tirumala: తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో పులి సంచారంతో శ్రీవారి భక్తుల్లో ఆందోళన మొదలైంది. కాగా, తిరుమల శ్రీవారి మెట్టు దగ్గర ఉన్న కంట్రోల్ రూమ్ వద్దకు రాత్రివేళ చిరుత రావడంతో కుక్కలు దాని వెంట పడ్డాయి.
తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, అన్ని తెలిసి సామాన్యుడు కూడా కాదు ఒక పాలకుడు సాక్షాత్తూ దేశంలోనే విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడుపై తన రాజకీయ దురుద్దేశంతో తన స్వార్థ రాజకీయాల కోసం తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్నినాని
మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు.. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అని విమర్శించారు..