Tirumala: 6 టికెట్లకు రూ.65వేలు.. బ్లాక్లో వీఐపీ దర్శన టికెట్లు.. ఎమ్మెల్సీపై భక్తుడి ఫిర్యాదు!
- బ్లాక్లో వీఐపీ దర్శన టికెట్లు
- బ్లాక్లో వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్న వైసీపీ ఎమ్మెల్సీ
- ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై 6 టికెట్లు పొందిన భక్తులు
- 6 టికెట్లను రూ.65 వేలకు భక్తులకు అమ్ముకున్న వైసీపీ ఎమ్మెల్సీ
- అధిక ధరకు అమ్ముకున్న ఎమ్మెల్సీపై టీటీడీ అధికారులకు భక్తుడి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారని ఓ భక్తుడు టీటీడీ విజిలెన్స్ వింగ్కు ఫిర్యాదు చేశాడు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను బెంగళూరుకు చెందిన సాయి కుమార్కు అధిక ధరకు విక్రయించిన ఓ ప్రజాప్రతినిధి. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం బ్లాక్లో వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్నట్లు ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై భక్తులు 6 టికెట్లను పొందారు. 6 టికెట్లను రూ.65 వేలకు భక్తులకు వైసీపీ ఎమ్మెల్సీ అమ్ముకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అధిక ధరకు అమ్ముకున్న ఎమ్మెల్సీపై టీటీడీ అధికారులకు భక్తుడు ఫిర్యాదు చేశాడు. విచారణలో నిర్ధారణ కావడంతో పోలీసులకు టీటీడీ విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు చేసింది. ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లను పోలీసులు చేర్చారు.
Read Also: Group -1 mains: జీవో 29 వర్సస్ 55 వివాదం ఏంటి..?
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
ఇదిలా ఉండగా.. ఈ విషయంపై ఎమ్మెల్సీ జకియా ఖానం స్పందించారు. తాను టీడీపీలో చేరుతున్నాననే విషయం తెలుసుకుని వైసీపీ నేతలు తనపై కుట్రపన్నారని ఆమె ఆరోపించారు. అందులో భాగంగానే తన లెటర్ను మిస్యూజ్ చేశారన్నారు. తన లెటర్ను డబ్బులకు ఇచ్చిన విషయం కూడా తనకు తెలియదన్నారు. పోలీసులు సమాచారం ఇవ్వడం వల్లే తనకు తెలిసిందన్నారు. కొందరు వైసీపీ నేతలు తనపై పని పెట్టుకుని కుట్రలో ఇరికించారన్నారు. నిజాయితీగా ఉండేవారికి వైసీపీలో గౌరవం లేదన్నారు. మైనార్టీ మహిళలకు వైసీపీలో గౌరవం లేదన్నారు. మా పీఆర్వో సెలవులో వెళ్లడంతో ఆ లెటర్ను ఎవరు ఎవరికి ఇచ్చారనేది తనకు తెలియదని ఎమ్మెల్సీ జకియా ఖానం స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!