Bandi Sanjay : పాతబస్తీ వాసులారా…. ఇకనైనా మేల్కొండి
- వక్ఫ్ బోర్డు భూములు పేద ముస్లింలకు చెందాలన్నదే కేంద్రం ఉద్దేశం
- ఓల్డ్ సీటీ ఇన్నాళ్లుగా ఎందుకు న్యూసిటీ ఎందుకు కాలేదో అర్ధమైందా?
- మీ ఓట్లతో ఒవైసీ కుటుంబం లక్షల కోట్ల ఆస్తులు ఎట్లా కూడబెట్టారో తెలుసుకోండి : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : టీటీడీలో హిందువులు మాత్రమే పనిచేయాలని చెబుతున్న నరేంద్ర మోడీ సర్కార్ వక్ఫ్ బోర్డ్ లో ముస్లిమేతరులకు చోటు కల్పించాలని బిల్లు రూపొందించడమేందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యాపారం చేస్తున్న అసదుద్దీన్ ఒవైసీ అసలు రంగు ఈరోజు పూర్తిగా బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి, వక్ఫ్ బోర్డు భూములకు లింకు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ‘‘కలియుగ ప్రత్యక్ష దైవం…. ఆ వైకుంఠాధీశుడు కొలువైన పరమ పవిత్రమైన స్థలం తిరుమల తిరుపతి దేవస్థానం. వక్ఫ్ బోర్డు అనేది కేవలం భూములకు సంబంధించిన వ్యవహారం మాత్రమే. మీరు ప్రార్ధించే మక్కా మసీదు కూడా కాదు. అయినా సిగ్గులేకుండా టీటీడీకి, వక్ఫ్ బోర్డు పేరుతో సాగిస్తున్న భూముల దందాకు లింకు పెడతవా? ఒవైసీ’’ అంటూ మండిపడ్డారు. టీటీడీలో ముస్లిమేతరులకు స్థానం కల్పించనప్పుడు….వక్ఫ్ బోర్డులో హిందువులకు ఎందుకు స్థానం కల్పించాలంటూ ఒవైసీ చేసిన వ్యాఖ్యలనూ బండి సంజయ్ తీవ్రంగా తప్పుపట్టారు. వక్ఫ్ బోర్డు భూములు పేద ముస్లింలకు మాత్రమే దక్కాలన్నదే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశమని, అందులో భాగంగానే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చిందని తెలిపారు. టీటీడీ తనకు వచ్చిన విరాళాలతో పేదలకు, హిందూ ధార్మిక సంస్థలకు సాయం చేస్తోందే తప్ప…ఏనాడూ ప్రజల ఆస్తులను కబ్జా చేసుకోలేదని చెప్పారు.
Minister Nadendla Manohar: ప్రతి మహిళకు భరోసా ఇచ్చేందుకు వీలుగా దీపం-2 పథకం
Also Read
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
‘‘ఒవైసీ ద్రుష్టిలో భగవంతుడంటే వ్యాపారమే. అల్లా పేరు చెప్పుకుని భూములను దోచుకున్నడు. వేల ఎకరాలను కబ్జా చేసిండు. కాలేజీలు, ఆసుపత్రులు కట్టి వేల కోట్ల రూపాయలు దోచుకుంటుండు. చివరికి చెరువులను, శిఖం భూములను కూడా కబ్జా చేసి భవంతులు కట్టుకున్నడు. అట్లాంటి మతోన్మాది దేవుడిని వ్యాపార వస్తువుగా, అవకాశవాద అంశంగా మార్చుకోకుండా మాట్లాడగలడా…?’’అని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా పాతబస్తీ వాసులను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘ఒవైసీ మాటలు నమ్మి దశాబ్దాలుగా మోసపోతున్న పాతబస్తీ ముస్లిం సోదరులకు నేను చెప్పేదొక్కంటే… ‘‘ఇకనైనా వాస్తవాలు ఆలోచించాలి. దశాబ్దాల తరబడి ఓట్లేసి మీరు ఎంఐఎంను గెలిపిస్తున్నరు. అయినా ఓల్డ్ సిటీ ఇంకా ఎందుకు ఓల్డ్ సిటీగానే మిగిలిపోయింది? సైబరాబాద్ లాగా న్యూసిటీ ఎందుకు కాలేకపోయింది? కనీసం పాతబస్తీకి మెట్రో ఎందుకు రాలేకపోయింది? మీరింకా పాన్ షాపులు నడుపుకుంటూ, పంక్చర్లు వేసుకుంటూ, తినడానికి తిండిలేక సరైన ఇల్లు లేక ఎందుకు అల్లాడుతున్నరు?. మీ పిల్లలకు మంచి చదువులు ఎందుకు చదివించలేకపోతున్నరు? మంచి వైద్యం ఎందుకు అందించలేకపోతున్నరు? అదే సమయంలో మీ ఓట్లతో గెలిచిన ఒవైసీ కుటుంబం వక్ఫ్ భూములను ఆక్రమించి, చెరువు శిఖం భూములను కబ్జా చేసి కాలేజీలు, ఆసుపత్రులు కట్టి సేవ పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఎట్లా దోచుకుంటున్నరు..? అద్దాల భవంతుల్లో ఎట్లా తుల తూగుతున్నరు?…ఒక్కసారి ఆలోచించండి’’ అని కోరారు.
‘‘బీఆర్ఎస్ జాతకాలు మా దగ్గర ఉన్నాయి. అవి చెబితే వాళ్లు తట్టుకోలేరు. ఆ విషయాలన్నీ నేను ఇప్పుడు బయటపెట్టాలా ?’’ అంటూ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపైనా బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని రెచ్చగొట్టి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన కుటుంబ పార్టీ(బీఆర్ఎస్)తో పదేళ్లు అంటకాగిన నిఖార్సన దేశద్రోహ(ఎంఐఎం) పార్టీ. ఇయాళ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. తన అవసరార్ధ మిత్రుడి(బీఆర్ఎస్)ని మించి దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చి రాజ్యమేలుతున్న నకిలీ గాంధీ వారసుల పార్టీ(కాంగ్రెస్)ని మచ్చిక చేసుకునేందుకు తంటాలు పడుతోంది. పాపం…. ఒవైసీ సోదరుల శీల పరీక్ష గడువు ముగిసినట్లుంది. నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజాస్వామిక తెలంగాణ నినాదంతో ప్రజల్ని నమ్మించి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలను బిచ్చగాళ్లను చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని వాడుకుని వదిలేసింది. నకిలీ గాంధీ కుటుంబ వారసత్వ రాజకీయాలతో దేశాన్ని దోచుకునేందుకు సిద్దమైన కాంగ్రెస్ పార్టీతో అంటకాగేందుకు సిద్దమైంది. కల్వకుంట్ల కుటుంబమా? ఇకనైనా సిగ్గుతో తలదించుకోండి. రాజకీయ మతోన్మాదంతో రగిలిపోతూ జన్మనిచ్చిన తల్లికే వెన్నుపోటు పోడుస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్న (ఎంఐఎం) పార్టీతో అంటకాగినందుకు ముక్కు నేలకురాసి యావత్ తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పండి.’’అని సూచించారు.‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కార్యకర్తలారా…. దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేస్తే మీ పేరు చరిత్రలో నిలిచిపోతోంది. కానీ కేసీఆర్, ఒవైసీ, నకిలీ గాంధీ కుటుంబాల అవకాశవాద రాజకీయాల కోసం మీ జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి’’అని హితవు పలికారు.
Minister Nadendla Manohar: ప్రతి మహిళకు భరోసా ఇచ్చేందుకు వీలుగా దీపం-2 పథకం
తాజావార్తలు
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..