ఎన్నికల్లో హామీలు ఇవ్వడం.. విజయం సాధించిన తర్వాత వాటిని అమలు చేస్తూ.. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం ఎమ్మెల్యేల పని.. ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధి చేస్తామంటూ నాయకులు చెప్పేవారు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందా? అనే చర్చ మొదలైంది.. దానికి ముఖ్య కారణం హుజురాబాద్ ఉప ఎన్నికలే అంటున్నారు.. తాజాగా, యాదాద్రి భువన గిరి జిల్లా ఆలేరు ప్రజలు.. తమ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు చేసిన విజ్ఞప్తి వైరల్గా మారిపోయింది.. గొంగిడి సునీతగారికి ఆలేరు…
లెఫ్ట్ పార్టీల ప్రభావం ఉన్న హుజురాబాద్లో టీఆర్ఎస్ ఎత్తుగడ ఏంటి? వామపక్షాల మద్దతు కూడగడుతుందా? గత ఉపఎన్నికల చరిత్ర ఏం చెబుతోంది? అవే వ్యూహాలు హుజురాబాద్లో రిపీట్ అవుతాయా? లెఫ్ట్ పార్టీల మద్దతు టీఆర్ఎస్ సంపాదిస్తుందా? హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు,…
తెలంగాణ సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’పై ప్రత్యేకంగా ఫోకప్ పెట్టారు.. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలతో సమావేశం కూడా నిర్వహించారు సీఎం కేసీఆర్.. అయితే, దీనిపై రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి.. హుజురాబాద్లో ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. రాజకీయంగా లబ్ధిపొందడానికే ఈ పథకం తెచ్చారని ఆరోపిస్తున్నారు.. మరోవైపు.. ఈ వ్యవహారం…
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోనే భగీరథ పథకానికి శ్రీకారం చుట్టి పైలాన్ ను కూడా ఇక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు సురక్షిత నది జలాలు వచ్చాయని….ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రులు ప్రకటించారని..ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనత అని కొనియాడారు. ఇంటింటికి సురక్షిత నది…
ప్రస్తుతం దూరంగా ఉంటూనే అక్కడి వ్యవహారాలను చక్కబెడుతున్నారో మంత్రి. ఆయన అడుగుపెడితే మాత్రం ఆరడుగుల వ్యూహం తప్పదనే టాక్ ఉంది. అందుకే ఉపఎన్నిక జరిగే నియోజకవర్గంలో ఆ మంత్రి ఎంట్రీ ఎప్పుడన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆయనెవరో ఈస్టోరీలో చూద్దాం. హుజురాబాద్లో వేగంగా పావులు కదుపుతోన్న టీఆర్ఎస్ హుజురాబాద్ ఉపఎన్నికపై టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో ఎన్నో ఉపఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం ఉన్న గులాబీపార్టీ.. ఈ ఉపపోరును మాత్రం సీరియస్గా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని…
ఉపఎన్నికల షెడ్యుల్ విడుదల కంటే ముందే హుజురాబాద్లో సందడి మొదలైంది. రాజకీయ పార్టీలు ప్రచార హోరును పెంచుకుంటూ పోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు హుజురాబాద్ ఉపఎన్నికపైనే ఉంది. అక్కడ రాజకీయ పార్టీల నాయకులు చేసే ప్రకటనలు సర్వత్రా చర్చగా మారుతున్నాయి కూడా. పార్టీలు ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీలు వేసే ఎత్తుగడలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గెలుపు కోసం అధికార పార్టీ అయితే.. అన్ని వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కౌశిక్ రెడ్డిని…
హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే గులాబీ బాస్ సీఎం కేసీఆర్.. సంక్షేమ పథకాలు దృష్టిసారించగా… అటు మంత్రి కేటీఆర్… పార్టీ భవిష్యత్తు కార్యచరణపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యలోనే టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో మంత్రి కేటీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు బీమా…
మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. సిద్ధిపేట ఔటర్ బైపాస్ పైన, మెడికల్ కాలేజీ దగ్గరలో నిన్న రాత్రి బైక్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తూ డివైడర్ కు ఢీ కొట్టి, తీవ్రంగా గాయపడ్డారు సిద్ధిపేటకు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు. అయితే.. అదే సమయంలో సిరిసిల్ల పర్యటన ముగించుకున్న కేటీఆర్.. అదే మార్గంలో వచ్చారు. read also : మహిళలకు షాక్… మళ్లీ పెరిగిన బంగారం ధరలు ఈ నేపథ్యంలో…
భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి తన రాజకీయ భవిష్యత్ నిర్ణయం తీసుకున్నారు.. బీజేపీకి బైబై చెప్పిన తర్వాత.. ఆయన ఏ పార్టీలో చేరతారు? అనే చర్చ సాగుతోన్న నేపథ్యంలో… తాను టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు.. బీజేపీలో పరిస్థితిలు నాకు నచ్చలేదన్న పెద్దిరెడ్డి… కానీ, ఆ పరిణామాలపై విమర్శలు చేయదల్చుకోలేదన్నారు.. అయితే, ఈటల రాజేందర్.. బీజేపీలో చేరిన విషయంలో నాకు గౌరవం ఇవ్వలేదని కామెంట్ చేశారు.. ఇక,…
రానున్న రోజుల్లో జంట నగరాలుగా కార్మిక (సిరిసిల్ల) , ధార్మిక ( వేములవాడ) క్షేత్రాలుగా అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం మంత్రి కేటీఆర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ శాఖల పరిధిలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనుల పురోగతి, తదితర అంశాలపై మంత్రి కూలంకుషంగా చర్చించారు. ఇటీవల కురిసిన భారీ…