Home
Tollywood
Tollywood News
-
Akhanda: ఆగని `అఖండ` దూకుడు!
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం సంచలన విజయం సాధించి, పలు రికార్డులను నమోదు చేసుకుంది. ఈ సినిమా విడుదలయ్యాక పలు క్రేజీ ప్రాజెక్ట్స్ జనం ముందు నిలచినా, `అఖండ` మాత్రం ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండడం మరింత విశేషం. ఈ చిత్రంతో వరుసగా బాలయ్యతో మూడు సినిమాలు తీసి ఘనవిజయం సాధించి, డైరెక్టర్ బోయపాటి శ్రీను `హ్యాట్రిక్` సొంతం చేసుకున్నారు. ఇక ఈ మూడు చిత్రాలలోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయడం తెలిసిందే! ఈ కోణంలోనూ… -
Raashii Khanna : సౌత్ పై షాకింగ్ కామెంట్స్… క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
“ఊహలు గుసగుసలాడే” సినిమాతో సౌత్ కు పరిచయమైన బ్యూటీ రాశి ఖన్నా. ఆ తరువాత తన అందం, ట్యాలెంట్ తో వరుస అవకాశాలను పట్టేస్తూ మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇటీవల “రుద్ర” అనే హిందీ వెబ్ సిరీస్ లో మెరిసిన ఈ అమ్మడు యాక్టింగ్ పై ప్రశంసలు కురిశాయి. ఈ వెబ్ మూవీ ప్రమోషన్లలో గతంలో కొంతమంది హీరోయిన్లు చేసినట్టుగానే రాశిఖన్నా కూడా సౌత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్ లో… -
Anasuya : మగజాతి పరువు తీస్తున్నారు… నెటిజన్ పై యాంకర్ ఫైర్
బుల్లితెరపై యాంకర్ గా వెండితెరపై నటిగా సత్తా చాటుతున్న టాప్ యాంకర్ అనసూయ భరద్వాజ్. సుకుమార్ “రంగస్థలం”లో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. అప్పటి నుంచి ఆమె “పుష్ప” వంటి భారీ సినిమాల్లో నటించే అవకాశాన్ని కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనసూయ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ అనసూయ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్… -
Raid At Pudding & Mink Pub : రాత్రి నుంచి స్టేషన్ లోనే నిహారిక
హైదరాబాద్లో ఇటీవల భారీగా డ్రగ్స్ కార్యకలాపాలు సాగుతున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో మరో భారీ రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేసి యజమానితో సహా 150 మందిని అరెస్టు చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడం హాట్ టాపిక్గా మారింది. పబ్లో జరిగిన పార్టీలో వీరంతా డ్రగ్స్ వాడినట్లు… -
Galla Ashok : పబ్ వివాదంతో సంబంధం లేదు !
ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు దాడి జరిపారు. అందులో పలువురు ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారు అనే వార్తలు సంచలనంగా మారాయి. బంజారాహిల్స్లోని ఓ ప్రముఖ పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేసి యజమానితో సహా 150 మందిని అరెస్టు చేశారు. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఉండడంతో ఇది హాట్ టాపిక్గా మారింది. పబ్లో జరిగిన పార్టీలో వీరంతా డ్రగ్స్… -
Asuragana Rudra : నరేష్ అగస్త్య సినిమాకు ఆసక్తికర టైటిల్
మత్తు వదలరా, సేనాపతి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నరేష్ అగస్త్య మళ్లీ మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. మురళి కాట్రగడ్డ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతలు ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో “అసురగణ రుద్ర” అనే టైటిల్ను ప్రకటించారు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ… -
Rahul Sipligunj : పబ్ లో అడ్డంగా దొరికిపోయిన బిగ్ బాస్ విన్నర్… పోలీసుల అదుపులో 150 మంది
బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయనతో పాటు దాదాపు 150 మందిని , పబ్ యజమానిని కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంజారాహిల్స్ లోని ఓ పబ్ లో తాజాగా పోలీసులు దాడులు జరిపారు. పోలీసులకు ర్యాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ పట్టుబడిన 150 మంది రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. Read Also :… -
Happy Ugadi : శ్రీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు… సెలెబ్రిటీల విషెస్
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం… ఈరోజు తెలుగు వారికి మరో కొత్త సంవత్సరం ప్రారంభం. తెలుగు వారు సాంప్రదాయకంగా భావించే ఉగాది పండగను దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది పండుగ చైత్ర మాసం మొదటి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 2, శనివారం వచ్చింది. ఈ పండగ సందర్భంగా ప్రజలు సంప్రదాయబద్ధంగా తమ ఇంటిని… -
Tollywood: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు శరత్ కన్నుమూత
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు శరత్ శుక్రవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. తెలుగులో ఆయన దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘డియర్’ అనే నవల ఆధారంగా ‘చాదస్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి శరత్ పరిచయం అయ్యారు. బాలకృష్ణ, సుమన్ హీరోలుగా సినిమాలు తెరకెక్కించి భారీ విజయాలు సాధించారు. ఏఎన్నార్తో ‘కాలేజీ బుల్లోడు’, జగపతిబాబుతో ‘భలే బుల్లోడు’, బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య,… -
Tollywood n Kollywood: ఇక్కడ మూడు! అక్కడ మూడు!!
గత శుక్రవారం పాన్ ఇండియా మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కావడంతో మరో సినిమా గురించి ఎవరూ ఆలోచన చేయలేదు. టాలీవుడ్ లో అయితే ఈ మాగ్నమ్ ఓపస్ మూవీకి దారి వదులుతూ మిగిలిన వాళ్ళంతా ఒక వారం వెనక్కో ఓ వారం ముందుకో వెళ్ళిపోయారు. అయితే ఈ శుక్రవారం ‘ట్రిపుల్ ఆర్’ హంగామా సద్దుమణగడంతో మూడు సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. విశేషం ఏమంటే అందులో చెప్పుకోదగ్గది తాప్సీ కీలక పాత్ర పోషించిన ‘మిషన్ ఇంపాజిబుల్’.…
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?