ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిపోయింది… అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బన్నీ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను అని పేర్కొన్నారు.. కాగా, అల్లు అర్జున్తో ఫొటోలు దిగే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని వదులుకోకండి అంటూ… సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారిపోవడంతో.. బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి తరలివచ్చారు.. క్యూలైన్లో…
(డిసెంబర్ 14న ఆది పినిశెట్టి బర్త్ డే)ఆరడుగులకు పైగా ఎత్తు, చక్కని శరీరసౌష్టవం- అటు ప్రతినాయకునిగానైనా అలరించగల నేర్పు, ఇటు కథానాయకునిగానూ మెప్పించగల ఓర్పు రెండూ ఉన్నాయి ఆది పినిశెట్టిలో. చూడగానే ఇట్టే ఆకట్టుకొనే రూపంతో ఆది పినిశెట్టి తనకు లభించిన పాత్రలకు న్యాయం చేసుకుంటూ సాగుతున్నారు. ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. ఆది మాత్రం నటునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాలలో విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా…
(డిసెంబర్ 14న రానా దగ్గుబాటి పుట్టినరోజు)కాలం కలసి వస్తే – జాలం భలేగా ఉంటుందని అంటారు. స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు ఇంట జూనియర్ రామానాయుడుగా జన్మించిన రానా అలాంటి లక్కీ మేన్ అని చెప్పవచ్చు. దగ్గుబాటి నట కుటుంబంలో మూడో తరానికి చెందిన వారు రానా. తాత రామానాయుడు కొన్ని చిత్రాలలో నటునిగా కనిపించగా, బాబాయ్ వెంకటేశ్ స్టార్ హీరోగా అలరించారు. వారి బాటలోనే రానా కూడా నటనలో అడుగు పెట్టి అనతికాలంలోనే తనదైన బాణీ పలికించారు.…
రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో మొదలైంది. డిసెంబర్ 13న రెజీనా పుట్టిన రోజు కావడంతో యూనిట్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేయించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రా ఎంటర్టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా అధినేతలు మాట్లాడుతూ, ”సోషల్ సెటైరికల్గా ప్రస్తుత కాలమాన పరిస్థితులపై వాస్తవిక కోణంలో.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్…
జానపద గీతాలతో తెలుగునాట చక్కని గాయనిగా పేరు తెచ్చుకున్న మంగ్లీ, ఆ మధ్య శివరాత్రి సందర్భంగా ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ సమక్షంలో శివుని గీతాలు ఆలపించి, యావత్ భారతవనిలో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు సినిమాలలోనూ పాటలు పాడి, తనకంటూ ఓ సుస్థిర స్థానం పొందింది. ఇదిలా ఉంటే మంగ్లీ ఇప్పుడు కోలీవుడ్, శాండిల్ వుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. తమిళ సినిమా ‘గోల్ మాల్’లో మంగ్లీ ఇటీవల…
కరోనా మహమ్మారి తరువాత థియేటర్లలో సినిమాల సందడి మళ్ళీ మొదలైంది. డిసెంబర్ 10, శుక్రవారం కూడా థియేటర్ తో పాటు ఓటిటిలో కూడా దాదాపుగా ఏడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ వారాంతంలో థియేటర్లలో అలాగే ఓటిటిలలో ప్రీమియర్ అవుతున్న చిత్రాలను చూద్దాం. నాగ శౌర్య స్పోర్ట్స్ ఎంటర్టైనర్ “లక్ష్య”తో సిద్ధమయ్యాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. శ్రియ, నిత్యా మీనన్, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రల్లో…
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పా రెడ్డి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులను కలిశారు. శిల్పా రెడ్డి నటుడు సమీర్ రెడ్డికి సోదరి, అలాగే సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరు. ఇటీవలే వారిద్దరూ కలిసి ఆధ్యాత్మిక ఛార్ ధామ్ యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా శిల్పా సీఎం జగన్ ను విజయవాడలో కలిసినట్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. Read…
శంషాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ మీద వెళ్తున్న ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. టీవీ సీరియల్స్ నటి లహరి కారు నడుపుతూ బైక్ మీద వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం తర్వాత కారు చుట్టూ గుమిగూడిన జనాల్ని చూసి భయపడిన లహరి, కిందికి దిగలేదు. దాంతో పోలీసులు, ఆమెను కారులోనే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. లహరి మద్యం సేవించిందేమోనన్న అనుమానంతో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. అయితే ఆమె మద్యం…
పాన్ ఇండియా మూవీ ‘కె.జి.ఎఫ్. చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. కన్నడలో తెరకెక్కిన ఈ మూవీని చాలామంది ‘బాహుబలి’తో పోల్చారు. ఆ మూవీ సరసన నిలబడదగ్గ చిత్రంగా కొనియాడారు. కన్నడంతో పాటు అప్పట్లోనే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ‘కె.జి.ఎఫ్.’ విడుదలై ఘన విజయం సాధించింది. ‘బాహుబలి’ తరహాలోనే దీనిని కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ‘చాప్టర్ -2’ షూటింగ్ కొద్ది…
దీపక్ దర్శకత్వంలో రూపుద్దిద్దుకున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మనసానమః’ 2022 ఆస్కార్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో క్వాలిఫై అయ్యింది. త్వరలో జరిగే ఓటింగ్ తో నామినేషన్ సైతం దక్కించుకుంటుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ‘మనసానమః’ లఘు చిత్రాన్ని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో మీడియాకు ప్రదర్శించారు. స్క్రీనింగ్ అనంతరం దర్శకుడు దీపక్ మాట్లాడుతూ, ”కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ షార్ట్ ఫిల్మ్…