డిఫరెంట్ జోనర్ సినిమాలతో తనదైన ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్.. రీసెంట్గా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో హిట్ కొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఇది మంచి వసూళ్ళను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఇతనికి క్రేజీ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఈ యంగ్ హీరోతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట! తన కూతురు ఐశ్వర్య అర్జున్నే ఇందులో కథానాయికగా నటింపజేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అర్జున్ సర్జా…
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా లైన్లో పెట్టిన క్రేజీ ప్రాజెక్టుల్లో ‘భవదీయుడు భగత్సింగ్’ సినిమా ఒకటి. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ కలిసి ఈ సినిమా చేస్తుండడంతో.. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే.. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలాకాలమే అవుతున్నా, ఇంకా కార్యరూపం దాల్చుకోలేదు. ప్రీ-ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయని మేకర్స్ చెప్తున్నారు కానీ, ఇదెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్నదే స్పష్టత లేదు. ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్టులు, రాజకీయ వ్యవహారాల నుంచి…
జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రతి చిన్న సందర్భాన్ని కూడా వీళ్ళిద్దరూ ఎంతో గ్రాండ్గా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ విషయాన్ని స్వయంగా వాళ్ళిద్దరే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పారు. పుట్టినరోజుల్ని అయితే చాలా స్పెషల్గా జరుపుకుంటామని, కారులో షికారుకి వెళ్తామంటూ తారక్ పలు సందర్భాల్లో వెల్లడించాడు కూడా! ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తమని మరింత దగ్గర చేసిందని ఇద్దరూ తెలిపారు. ఇప్పుడు రామ్ చరణ్ చేసిన…
జూ. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ‘జై లవ కుశ’లో తాను చెప్పిన ‘ఘట్టమేదైనా, పాత్రేదైనా’ అన్నట్టు.. ఎలాంటి పాత్ర ఇచ్చినా అవలీలగా చేసేస్తాడు. ఇతని నటనలో సహజత్వం ఉట్టిపడుతుందే తప్ప.. ఎక్కడా ఫేక్ కనిపించదు. ఈతరం హీరోల్లో నవరసాల్ని పండింగల హీరో ఎవరైనా ఉన్నారంటే, అది తారక్ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సాక్షాత్తూ.. దర్శకధీరుడు రాజమౌళి లాంటోడే తన ఫేవరేట్ హీరో అని తారక్ చెప్పాడంటే, అతడు ఎంత విలక్షణ…
పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ గడించిన కథానాయికల్లో సమంత ఒకరు. అయితే, ఆమె ఈ స్థాయికి అంత ఈజీగా చేరుకోలేదు. ఎన్నో కష్టాలు, సవాళ్ళను ఎదుర్కొని.. ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. జెస్సీ (ఏం మాయ చేశావే)గా యువత మనసు దోచిన ఈ భామ.. ఆ తర్వాత నటన పరంగా ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంది. అందంతో నెట్టుకొస్తోందే తప్ప, యాక్టింగ్ రాదంటూ ఎందరో పెదవి విరిచారు. అలాంటి వాళ్ళందరి…
కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరాటే కళ్యాణి మరియు మౌక్తిక నిన్న వెళ్లారు.. ఎక్కడికి వెళ్ళారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు..నిన్నటి నుండి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని.. నా కూతురు పై కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. తమ దగ్గర డబ్బులు తీసుకొని మాపైనే ఆరోపణలు చేస్తున్నారని… శ్రీకాంత్ రెడ్డి నా కూతురు పై అటాక్ చేస్తానని బెదిరించాడని వెల్లడించారు. నిన్నటి నుండి కూతురు కళ్యాణి, పాపా మౌక్తిక ను ఎవరు తీసుకొని…
ఇప్పుడు మన తెలుగు చిత్రసీమ ఇండియన్ సినిమాపై ఆధిపత్యం చెలాయిస్తుండడమే కాదు.. ప్రపంచ స్థాయి సినిమాలకు కూడా ధీటుగా పోటీనిస్తోంది. ఉన్నత ప్రమాణాలతో రూపొందుతూ.. విశేష ఆదరణను చూరగొనడంతో పాటు కలెక్షన్ల పరంగా సరికొత్త మైలురాళ్ళనే సృష్టిస్తున్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు విదేశాల్లోనూ ఎలా అలజడి సృష్టించాయో అందరూ చూశారు. ఆర్ఆర్ఆర్ అయితే కొన్ని ‘ద బ్యాట్మాన్’ సినిమానే వెనక్కు నెట్టేసింది. అలాంటి మన టాలీవుడ్పై భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ…
బాలీవుడ్ ఎంట్రీపై హీరో మహేష్ బాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. హిందీలో ఆఫర్లు ఉన్నప్పటికీ బాలీవుడ్ నిర్మాతలు తనను భరించలేరన్న ఆయన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సినీ రంగం నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. తాజాగా నటి కంగనా రనౌత్ మహేశ్ బాబుకు మద్దతుగా మాట్లాడారు. మహేశ్ బాబు అన్నది నిజమే…ఆయనను బాలీవుడ్ భరించలేదని చెప్పింది. ఆయనకి తగిన రెమ్యునరేషన్ని బాలీవుడ్ ఇవ్వలేదని కూడా చెప్పింది. అంతేకాకుండా టాలీవుడ్ను చూసి చాలా…
యూసుఫ్ గూడ బస్తీలో యూట్యూబర్ శ్రీకాంత్రెడ్డిని సినీనటి కరాటే కల్యాణి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి దాడిచేసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. శ్రీకాంత్ రెడ్డి ఎక్కువగా ప్రాంక్ వీడియోలు చేస్తుంటాడు. ఆయన వీడియోలకు మంచి ఆదరణ ఉంది. నిన్న శ్రీకాంత్రెడ్డి ఇంటికి వెళ్లిన కల్యాణి.. ప్రాంక్ వీడియోల విషయమై నిలదీసింది. ప్రాంక్ పేరుతో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని…
బాలీవుడ్ తనని భరించలేదని, అక్కడికెళ్ళి తన సమయాన్ని వృధా చేసుకోలేనని మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఎంత దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా.. బాలీవుడ్ నుంచి తారాస్థాయి వ్యతిరేకత ఎదురవుతోంది. మహేశ్ని చాలా బ్యాడ్గా ట్రోల్ చేస్తున్నారు. తాను బాలీవుడ్ని కించపరచలేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ.. మహేశ్పై విమర్శలు ఆగడం లేదు. అయితే.. నిర్మాత బోనీ కపూర్ మాత్రం తాను మహేశ్ వ్యాఖ్యలపై స్పందించనని చేతులెత్తేశాడు. ఆ కామెంట్స్పై రియాక్ట్ అవ్వడానికి తాను…